Suryaa.co.in

Andhra Pradesh

నేడు..యువగళం-నవశకం సభకు సర్వం సిద్ధం…

-తొలిసారిగా ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేశ్
-సభాప్రాంగణను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న… పల్నాడు జిల్లా టీడీపీ గురజాల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు.. యరపతినేని

-ముగిసిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
-పోలేపల్లి వద్ద భారీ బహిరంగ సభ
-హాజరవుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా, (డిసెంబరు 20) భోగాపురం మండలం పోలేపల్లి వద్ద భారీ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు.

ఈ యువగళం-నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు.

ఈ భారీ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు.

ఈ వేదికపై నుండి ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటంతో దీనిపై రాష్ట్ర, జాతీయ మీడియా కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం.

110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవనున్నారు. సభా వేదిక ఎదురుగా వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

రాష్ట్రం నలుమూలల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు రెండు చోట్ల, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు రెండు చోట్ల భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు.

పోలేపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత తోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం-విజయనగరం మధ్య కట్టిన భారీ కటౌట్లు, జెండాలతో ఆ ప్రాంతమంతా పసుపుజాతరను తలపిస్తోంది.

రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుంది:  నవగళం బహిరంగసభలో టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోంది. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అరాచకపాలనపై విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు యువగళానికి బ్రహ్మరథం పట్టారు.యువగళాన్ని ఆపేందుకు వైసీపీ లైసెన్స్ డ్ గూండాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

ఎన్ని ఆటంకాలు సృష్టించినా యువనేత ముందుకు కదిలారే తప్ప…ఎక్కడా వెనకడుగు వేయలేదు.సైకో పాలనలో ప్రజాస్వామ్యయుతమైన పాలన కనుమరుగైంది.యువగళం తో నారా లోకేష్ జనహృదయనేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల కలయికతో రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుంది.

 

LEAVE A RESPONSE