– ట్విట్టర్ లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి…
దొంగోడు పాలకుడైతే యంత్రాంగమూ దొడ్డిదారిన వస్తుందనడానికి అయ్యన్నపాత్రుడు ఇంటిపై మున్సిపల్ యంత్రాంగం, పోలీసుల దాడి మరో నిదర్శనం. ఆక్రమణలంటూ కట్టుకథలు అల్లుతున్న అధికారులకు ఉదయం పూట నోటీసులు ఇవ్వడం చేతకాదా? అర్ధరాత్రి ముసుగులేసుకుని గోడదూకి నోటీసులు విసిరేసి జేసీబీతో గోడని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ నిర్మాణం అక్రమమైతే శనివారం రాత్రి, ఆదివారం మాత్రమే గుర్తొస్తుందా? మిగిలిన ఐదురోజులు అధికారులంతా సెలవులో వున్నారా? సైకో ముఖ్యమంత్రి అడ్డగోలు ఆదేశాలు అమలు చేస్తున్న అధికారులు చట్టప్రకారం వ్యవహరించకపోతే, తగిన మూల్యం చెల్లిస్తారు. వచ్చేది టిడిపి ప్రభుత్వం. మిమ్మల్ని పంపిన సైకో సీఎం ఏ విదేశాలకో పారిపోతాడు. మీకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారీ మీకు మద్దతుగా ఉండడు. చట్టాన్ని కాపాడండి. సహకరిస్తాం. నిబంధనల మేరకు వ్యహరించండి..మేమూ పాటిస్తాం. అధికార పార్టీ చెప్పింది కదా అని జేసీబీలు వేసుకు వస్తే.. మేము జనంతో వస్తాం. తట్టుకోగలరా?