– హెచ్ సిఎల్ సిఇఓ కళ్యాణ్ కుమార్ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: హెచ్ సిఎల్ సిఇఓ కళ్యాణ్ కుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హెచ్ సిఎల్ విస్తరణ కార్యకలాపాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను వివరించిన మంత్రి లోకేష్…. రాష్ట్రంలో మరో 10వేలమందికి ఉపాధి కల్పించేలా హెచ్ సిఎల్ ను విస్తరించాలని కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన కొత్తపాలసీలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఎఫ్ఐడిలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు. ఎపిలోకి రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్ మెంట్ ఇంపోర్ట్ కు 50శాతం సబ్సిడీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగంలో ఎపి 10శాతం వాటా కలిగి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, 3 డెడికేటెడ్ ఐటి స్పెషల్ ఎకనమిక్ జోన్లు ఉన్నాయని లోకేష్ చెప్పారు.
హెచ్ సిఎల్ సిఇఓ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ… హెచ్ సిఎల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం తమ సంస్థలో 2.18లక్షల మంది పనిచేస్తున్నారు. 2024-25లో హెచ్ సిఎల్ 4,235 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఆంధ్రప్రదేశ్ సంస్థ విస్తరణ కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే సంస్థ ప్రతినిధులు మీతో చర్చలు జరిపారు. త్వరలో విస్తరణ కార్యకలాపాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని కళ్యాణ్ కుమార్ అన్నారు.