Suryaa.co.in

Andhra Pradesh Crime News

నకిలీ పోలీసుల అరెస్ట్

పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయలు నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి కృష్ణ, సుబ్బారాయుడు తో పాటు కడప జిల్లాకు సుధాకర్, కళ్యాణ్, ప్రసాద్ లు ముఠాగా ఏర్పడి హైవే దొంగతనానికి పధకం సిద్దం చేశారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి చిరంజీవి తన కారులో బంగారం కొనుగోలు చేయడానికి మరో ఇద్దరితో కలిసి విజయవాడకు వెళుతున్న సమయంలో గుడ్లూరు శాంతినగర్ ప్రాంతానికి రాగానే కారు ఆపి భారీ మొత్తంలో అక్రమ డబ్బును తీసుకువెళుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, వెంటనే డీఎస్పీ కార్యాలయానికి రావాలని హెచ్చరించారు. లేని పక్షంలో కేసులేకుండా విడిచి పెట్టడానికి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కారులో వున్న 50 లక్షల రూపాయల బ్యాగ్ ను తీసుకొని ఇన్నోవా కారులో పారిపోయారు. జరిగిన సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టి నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 47లక్షల రూపాల నగదును స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ తెలిపారు.

LEAVE A RESPONSE