పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయలు నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి కృష్ణ, సుబ్బారాయుడు తో పాటు కడప జిల్లాకు సుధాకర్, కళ్యాణ్, ప్రసాద్ లు ముఠాగా ఏర్పడి హైవే దొంగతనానికి పధకం సిద్దం చేశారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి చిరంజీవి తన కారులో బంగారం కొనుగోలు చేయడానికి మరో ఇద్దరితో కలిసి విజయవాడకు వెళుతున్న సమయంలో గుడ్లూరు శాంతినగర్ ప్రాంతానికి రాగానే కారు ఆపి భారీ మొత్తంలో అక్రమ డబ్బును తీసుకువెళుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, వెంటనే డీఎస్పీ కార్యాలయానికి రావాలని హెచ్చరించారు. లేని పక్షంలో కేసులేకుండా విడిచి పెట్టడానికి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కారులో వున్న 50 లక్షల రూపాయల బ్యాగ్ ను తీసుకొని ఇన్నోవా కారులో పారిపోయారు. జరిగిన సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టి నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 47లక్షల రూపాల నగదును స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ తెలిపారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…