డెంగ్యూపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

-వైద్య ఆరోగ్య , మున్సిపల్ శాఖలతో కలిసి, యుద్ధప్రాతిపదికన డెంగ్యూ నివారణ చర్యలు
-జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో జ్వర సర్వే
-జీహెచ్ఎంసీ పరిధిలో బూస్టర్ డోస్ విరివిగా వేసే కార్యక్రమం
-డెంగ్యూపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంయుక్త సమావేశం
-జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి జ్వర సర్వేను వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎం సిబ్బంది కలిసి చేయాలని మంత్రులు హరీశ్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం
-జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, జీహెచ్ఎంసీ,మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష

మంత్రి హరీశ్ రావు కామెంట్స్
డెంగ్యూ కేసులు హైదరాబాద్ నగర పరిధిలోను, జిల్లాలోను పెరుగుతున్నాయి. ప్రతీ ఐదేళ్లకు ఒక సారి డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. ఇది ఐదో సంవత్సరం కాబట్టి డెంగ్యూ కేసులు కొంచెం పెరుగుతున్న తీరు గమనిస్తున్నం. కాబట్టి వైద్య ఆరోగ్య పురపాలక,పంచాయతీ శాఖలు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో జులై నెలలో 542 డెంగ్యూ కేసులు ఉంటే ఆగష్టులో 1827 కేసులున్నాయి. బాగా జాగ్రత్తపడాలి. డెంగ్యూను కారకమైనది.. మంచి నీటి దోమ. ఇవి పగటి పూటనే కుడతాయి. తొట్టిలో, కొబ్బరిచిప్పలు, పాత టైర్లు వంటి వాటిలో పెరుగుతాయి. జీహెచ్ఎంసీలో 1600 మంది ఎటమాలజీ స్టాప్ ఉన్నారు. బాగా పని చేస్తున్నారు. వీరితో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి చైతన్యపర్చాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేయించాలి.

స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించడం జరిగింది. ప్లెట్స్ లేట్స్ సపరేటర్ మిషన్లు అందుబాటులో ఉంచినం. ఎంత బ్లడ్ అవసరమైన ఉచితంగా ఇచ్చేందుకు వైద్యఆరోగ్య శాఖ ఉచితం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు, ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 17 న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఏర్పాట్లు చేస్తాం.

దోమల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలి. టీవీ, రేడియో మాధ్యమాల ద్వారా బాగా ప్రచారం చేయాలి. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జ్వరపీడితులు బస్తీ దవాఖానాకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలి. డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలి. టీ డయాగ్నసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందిస్తాం. ప్రజలు ఆందోళన చెంద వద్దు. డెంగ్యూ కేసుల నిర్థారణకు ర్యాట్ కిట్స్ బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉంచాం. జ్వరం వస్తే వెంటనే బస్తీ దవాఖానాల్లో వెళ్లి చికిత్స చేయించుకోవాలి. టి డయాగ్నోసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి వైద్యం అదింస్తాం.

27వేల టెస్టులు గతన్న నెలన్నరగా టీ డయాగ్నసిస్ ద్వారా చేయడం వల్ల కేసులు పెరిగినట్లు కనిపిస్తున్నాయి. బస్తీ దవాఖానాల వల్ల ఫీవర్ ఆసుపత్రికి కేసులు తగ్గాయి. గాంధీ ఆసుపత్రికి కేసులు తగ్గాయి. ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, లో బ్లడ్ సపరేటర్స్ ఉన్నాయి. బ్లడ్ విషయంలో ఇబ్బంది లేదు. ఈ జ్వర సర్వేతో పాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ప్రతీ ఒక్కరికి జీహెచ్ఎంసీ పరిధిలో వేసేందుకు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ సిబ్బంది, వైద్య సిబ్బంది కలిసి పని చేయాలి.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కామెంట్స్
గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం బాగా చేశాం.
హెల్త్ డిపార్ట్మెంట్ , పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది కలిసి పని చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్న హరీశ్ రావు గారి మాటకు ఏకీభవిస్తున్నా.
జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్ ,డిప్యూటీ కమిషనర్లు ఏయే వార్డుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్నాయో.. పరిశీలించండి. నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలి.
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోను ప్రణాళిక తయారు చేయాలి. ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని శుభ్రపరిచే కార్యక్రమం కోసం చిన్న పిల్లలను, మహిళలను ఇంక్లూడ్ చేయాలి. మెప్మాను ఈకార్యక్రమంలో వినియోగించాలి.
విద్యార్థులు, ప్రిన్స్ పాల్స్, టీచర్లు అందరూ పాల్గొని సామాజిక బాధ్యతగా పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్స్ అంటించాలి.
డెంగ్యూ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచి నీటిలో ఉంటుంది. వర్షం లేదా ట్యాప్ లలో నుండి వచ్చే నీటిలోను పెరుగుతాయి. ఇలా నీరు నిలువ లేకుండా ఉండేలా చూడాలి.
స్కూల్ ఎడ్యుకేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్, మెప్మా, విద్యార్థులు, పిల్లలను , ప్రజా ప్రతినిధులను , స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలి.
లోకల్ గా ఈ కార్యక్రమాలు బాగా ప్రచారం చేయాలి. ఎంటమాలజీ టీం బాగా పని చేస్తుంది. యాంటీ లార్వా ఆపరేషన్లు బాగా చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెలబ్రిటీలను వినియోగించుకోవాలి. రేడియో, లోకల్ టీవీలు, హోర్డింగ్స్ వంటివి పెట్టి ప్రజలను చైతన్యపర్చాలి.
బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడదాం. సెప్టెంబర్ 17న క్యాంపులు విరివిగా నిర్వహిద్దాం.
మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఎఎస్ అధికారులు కూడా తమ గృహాలలో ఈకార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాలో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది.
డిజిటల్ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలి.
పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహిద్దాం. జీహెచ్ఎంసీ ఎటమాలజీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రం దిగ్విజయం చేయాలి.
ప్రభుత్వం ఇంటింటికి జ్వర సర్వే. హెల్త్ అండ్ మున్సిపల్ సిబ్బంది వెళ్లి వారితో మాట్లాడి జ్వరం ఉందా లేదా, బూస్టర్ డోస్ వేసుకున్నారా లేదా అని పరిశీలించాలి.
హైదరాబాద్ సహా జిల్లాల్లోని , డెంగ్యూ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే పక్బందింగా ఉద్యమంలా నిర్వహించాలి.
ఈ జూమ్ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, డెరక్టర్ హెల్త్ శ్రీనివాస రావు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply