వివిధ ఫలాల నైవేద్యం ఫలితాలు

భగవంతుడికి భక్తులు అనేక రూపాల్లో పూజలు చేస్తుంటారు. చాలామంది అనేక రకాల ఫలాలు దేవుడికి సమర్పిస్తుంటారు. మరి ఆయా ఫలాలు సమర్పించినందువల్ల వచ్చే ప్రయోజనం, స్వాంతన ఏమిటన్నది చాలామందికి తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి నమ్మకం వారిది మరి!
కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం )
భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.
అరటి పండు
భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే, సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
నేరేడు పండు
శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి, ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.
ద్రాక్ష పండు
భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే , ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
మామిడి పండు
మామిడి పండుని నైవేద్యంగా పెడితే, ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని, దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి, అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
అంజీర పండు
భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండును, అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
సపోటా పండు
సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే , పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
యాపిల్ పండు
భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
కమలా పండు
భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే, నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి.
పనసపండు
పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

Leave a Reply