– ఢిల్లీ వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి
– మోదీపై బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ఒత్తిడి తేవడం లేదు
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నాయకులు మతం రంగు పులమడం బాధాకరం. గుజరాత్ లో ఏ రకమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో అందరి తెలుసు. తెలంగాణలో ఆ పార్టీకి ఓట్లు రావని తెలిసి బీజేపీ నాయకులు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతానికిపైగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు విషయంలో మాత్రం కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం సాకులు చెబుతోంది.
తెలంగాణ బీసీలకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రిజర్వేషన్లను దూరం చేస్తోంది. ఫ్లైట్ మోడ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. కానీ ఢిల్లీలో ప్రధాని మోదీపై బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవడం లేదు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది.
బీసీలు పార్టీ పరమైన రిజర్వేషన్లు కోరుకోవడం లేదు. చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కోరుకుంటున్నారు. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను బీసీలు వదిలిపెట్టబోరు. తక్షణమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్సును తీసుకురావాలి