బీసీ సోదరులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా అవమానించిన జగన్ రెడ్డి

– వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే గాని బ్యాక్ బోన్ కాదు
– పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. పెద్ద పీట వేయడమంటే నిల్చోపెట్టి అవమానించడమేనా? మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులను నిల్చోని మాట్లాడటం యావత్ బీసీ సోదరులందరికి అవమానకరం. ఇదోనా బీసీల పట్ల మీకున్న గౌరవం. ఒక బీసీ మంత్రితో మోకాళ్ల దండంతో మోకించించుకున్నారు. బడుగు బలహీన మంత్రుల అధికారాలను లాక్కొని సామంతరాజులకు జగన్ రెడ్డి అప్పగించారు.

కేవలం 42 నెలల్లో 26 మంది బీసీలను హత్య చేశారు, 2650 మంది బీసీ సోదరులపై దాడులకు పాల్పడ్డారు. బీసీలను అణచివేసి మీ అదుపులో పెట్టుకోవాలని చూస్తున్నారు. బీసీ పీకలపై కత్తులు పెట్టి మీ స్వార్ధానికి వాడుకొని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. బీసీల దమ్మేంటో మీకు త్వరలోనే చూపిస్తాం. మీ స్వార్ధపూరిత రాజకీయాలను బీసీలు గమనిస్తున్నారు.

Leave a Reply