అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు మరియు పలువురు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే కనక సుందరరావు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దిశగా సాగిపోతుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా సీఎం చేస్తున్న అభివృద్ధి కార్యాక్రమాలకు ఆకర్షితుడయ్యానని తెలిపారు.
మా తాడేపల్లి నియోజక వర్గంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేస్తున్న అభివృద్ధి నభూతో నా భవిషత్. నియోజకవర్గం పరిధిలో ఉన్న పేద వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా పేదలు ఉన్నత స్థితి వస్తున్న సందర్భాలు అనేకం. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వ పథకాలతో పాటుగా డిప్యూటీ సీఎం అందిస్తున్న సాయం మరువలేనిదని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీ కండువా కప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు.