– 20 లక్షల ఉద్యోగాల సాధనకు కట్టుబడి నిరంతరం శ్రమిస్తున్నాం
– ఇకపై ప్రాజెక్టులకు సంబంధించి ప్రతివారం ఎనౌన్స్ మెంట్లు ఉంటాయి
– 17 నెలల్లో ఇన్వెస్టిమెంట్ ఎట్రాక్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారుచేశాం
– గూగుల్ వాళ్లకు కూడా రాష్ట్రానికి రావద్దని మెయిళ్లు పెట్టారు….
– వైసీపీ రాష్ట్రానికి హానికరం… వారి వల్ల అంతా విధ్వంసమే
– విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి : చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా కేవలం చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు 2014-19 నడుమ ఇండియా లార్జెస్ట్ ఆటోమోటివ్ ఎఫ్ డిఐ కియా తెచ్చారు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్ డిఐ ఇన్వెస్టిమెంట్ ఇన్ హిస్టరీ, ఏపీలో గూగుల్ 15బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. అమెరికా వెలుపల గూగుల్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇది. అనేక దేశాలు, రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఎపికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్ల పెట్టుబడి పెట్టగలం, ఇబ్బంది ఉండదని గ్రహించి వారు రాష్ట్రానికి వచ్చారు.
గూగుల్ రాక ఏపీ గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినవిధంగానే… ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోంది. ఇది కేవలం ఒక్క డాటా సెంటర్ గురించి మాత్రమే కాదు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎఐకి సంబంధించి అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం దీనిద్వారా 25రెట్ల ఆర్థిక ప్రభావం ఉంటుంది. అలాంటి ఎకనమిక్ యాక్టివిటీ గూగుల్ చేయబోతోంది. ఈ ఒక్క పెట్టుబడివల్ల 1,88,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థపై అయిదేళ్లలో రూ.48వేలకోట్ల ప్రభావం చూపుతుంది.
గూగుల్ కోసం చట్టాల్లో సవరణలు చేశాం
సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖకు వచ్చినపుడు డాటాసెంటర్ స్థలం చూపించాను. నెల తర్వాత నేను అమెరికా గూగుల్ క్లౌడ్ లీడర్ షిప్ ను కలిశాను. అనంతరం నవంబర్ లో వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఆ సమయంలో గూగుల్ ప్రతినిధి బృందం ఏపీలో కాకుండా దేశంలోనే కొన్ని చట్టాలను సవరించాలని కోరారు. దీనిపై నేను అశ్వనీ వైష్టవ్ దృష్టికి తీసుకెళ్లాను. ఈ అంశంపై ముఖ్యమంత్రి పలుమార్లు నిర్మలా సీతారామన్ ను కలిశారు. ప్రధాని మంత్రిని గూగుల్ పెట్టుబడిపై రెండుసార్లు కలిసి చర్చించిన తర్వాత చట్టాల్లో అవసరమైన సవరణలు చేశారు. అందువల్లే ఇంతపెద్ద ఇన్వెస్టిమెంట్ ఏపీకి, భారతదేశానికి వచ్చింది. ఐటి సెక్రటరీ భాస్కర్, కార్తికేయ మిశ్రా వంటి సీనియర్ అధికారులు ఈ ప్రాజెక్టు కోసం గ్రౌండ్ వర్క్ చేశారు. అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి విశాఖపట్నానికి ఈ భారీ పెట్టుబడి తెచ్చాం. ఏపీ సాధించింది, భారతదేశం సాధించింది, ఇది అందరం గర్వపడాల్సిన సమయం. ఈరోజు ప్రపంచమంతా భారతదేశం గురించి మాట్లాడుతోంది. భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కు ఎలా వచ్చిందని చర్చించుకుంటున్నాం.
అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం
మా లక్ష్యం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. కియామోటారుతో అనంతపురాన్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం. నార్త్ అనంతపురం, కర్నూలులో ఇప్పటికే పెద్దఎత్తున రెన్యువబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలులో రెండు కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చాం. మరో అయిదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తెస్తాం. చిత్తూరు, కడపజిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే అనేక పెట్టుబడులు వచ్చాయి. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో మా ప్రభుత్వం వచ్చాక అనేక పెట్టుబడులు తీసుకువచ్చాం.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే దేశంలో 50శాతం ఎసిలు ఎపిలో తయారవుతున్నాయి, డైకిన్, బ్లూస్టార్ విస్తరణకు వెళ్తున్నారు, అవి పూర్తయితే 80శాతానికి చేరుకునే అవకాశం ఉంది. స్పేస్ సిటీ రావాలన్న ఉద్దేశంతో ఇండియా స్పేస్ ఎక్స్ సంస్థ స్క్రై రూట్ కు 300 ఎకరాలు, ఎకరా 5లక్షలకు ఇచ్చాం.
ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజి పై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తోంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ కు సంబంధించి ఎకోసిస్టమ్ ఇక్కడకు తీసుకువస్తున్నాం. ఉభయగోదావరి ఆక్వా పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలను తీసుకువస్తున్నాం.
ఉత్తరాంధ్రకు భారీఎత్తున పెట్టుబడులు
ఉత్తరాంధ్రకు భారీఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ వారి ఇండియా లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్, గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, రహేజా, రహేజా వంటి నిర్మాణసంస్థలు, మెడికల్ డివైస్, ఫార్మా సంస్థలు వచ్చాయి. అన్నిప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేసి 2024నాటికి ఎపిని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది.
క్లస్టర్ బేస్డ్ విధానంలో వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ తో ముందుకెళ్తున్నాం. 100 కి.మీ.ల పరధిలో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. ప్రధాన సంస్థల అనుబంధ యూనిట్లన్నీ ఆ చుట్టుపక్కల వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. హారిజంటల్ విభాగంలో స్కిల్ డెవలప్ మెంట్, ఎక్విప్ మెంట్, టెస్టింగ్ వంటివాటికి ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే జోన్ లవారీగా అభివృద్ధి చేస్తున్నాం. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తో ముందుకెళ్తున్నాం.
ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా గ్రేటర్ విశాఖ
గ్రేటర్ విశాఖ ఎకనమిక్ కారిడార్ ను 1ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి, ఇంటిగ్రేటెడ్ ప్రణాళికలు (ఎయిర్ పోర్టు, రైల్వే, రహదారులు) రూపొందిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి 30ఏళ్లు పడితే, పదేళ్లలోనే విశాఖను అదేతరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
విశాఖ, అమరావతి, రాయలసీమ ఎకనమిక్ కారిడార్ లను ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెం.1గా నిలబడుతుంది. ఎంఓయులను పట్టించుకోకుండా నేరుగా ఎగ్జిక్యూషన్ కే వెళ్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్ తో ఇప్పటికీ ఎంఓయు లేదు, నవంబర్ లో భూమి పూజ చేస్తున్నాం. టిసిఎస్ కు ఎంఓయు లేకపోయినా నవంబర్ లో ప్రారంభించబోతున్నాం.
ఐటి రంగంలో 5లక్షల ఉద్యోగాలు
రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులపై నిరంతరం ఫాలో అప్ చేస్తున్నాం. చాలామంది దావోస్ వెళ్లి ఏంచేశారని అడిగారు. దావోస్ లో గూగుల్ క్లౌడ్ సిఇఓను ముఖ్యమంత్రి గారు కలిశారు. నేను ముంబాయి వెళ్లినపుడు టిసిఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ తో పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించాను. పెట్టుబడుల కోసం క్రియాశీలకంగా, చురగ్గా ముందుకెళ్తున్నాం. టాప్ -10 ఇన్వెస్టర్స్ లిస్ట్ నా బ్యాగులోనే ఉంటుంది. ప్రతివారం వాటిని మా కార్యాలయం ఫాలో అప్ చేస్తుంది. ప్రతి ప్రాజెక్టుకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటుచేశాం.
రిలయన్ సిబిజి పరిశ్రమకు ఒక వారం అప్ డేట్ రాకపోతే నేనే రంగంలోకి దిగుతున్నా. బాబు సూపర్ 6 తొలి హామీ 20లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. ఈ లక్ష్యసాధనకు అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక్క ఐటి రంగంలోనే 5లక్షల ఉద్యోగాలు కల్పించాలని చాలెంజ్ గా తీసుకున్నాం. రాబోయేరోజుల్లో ప్రతి వారం కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటాయి. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు 17నెలలు మంత్రులందరం కలసి పనిచేస్తున్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం.
2019-24 నడుమ ఎవరూ ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదు. వారి హయాంలో కేవలం విధ్వంసమే. మేం వచ్చాక 17నెలల్లో ఇన్వెస్టిమెంట్ ఎట్రాక్ట్ స్టేట్ గా ఎపి మారింది. ఇందుకు ప్రధాన కారణం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ కారణం.
ఢిల్లీలో ప్రధాని ప్రధాని మోడీ, ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కలసికట్టుగా కృషిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తేగా, ఒక్క ఫోన్ కొడితే ఎపిలో అమలు చేస్తారనే నమ్మకం వారిలో కలిగింది. లేబర్ రిఫామ్స్ ను కేవలం 15రోజుల్లో చేసి చూపించాం. మేం అనుకున్నది సాధించాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. ఎపిని అన్నిరంగాల్లో నెం.1గా చేసేందుకు ప్రజలు మాతో కలిసిరావాలని మంత్రి లోకేష్ కోరారు.
చంద్రబాబు విజన్ తోనే పెట్టుబడుల రాక
విలేకరుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటుచేశాం. గూగుల్ డాటా సెంటర్ భారీఎత్తున బహుళ ఆర్థిక ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం 25రెట్లవరకు ఉండవచ్చని అంచనా. విజనరీ లీడర్ వల్లే ఇది సాధ్యమైంది. మేము టిసిఎస్, కాగ్నిజెంట్ లకు మాత్రమే ఎకరా రూపాయికి భూములిచ్చాం. ఇంకెవరికైనా ఇచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కౌన్సిల్ లో చాలెంజ్ చేశా. ఆ రెండు సంస్థలు 25వేల ఉద్యోగాలు కల్పిస్తాయి, వాటివల్ల 15వేల కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు సాగుతాయి. వీటివల్ల యావత్తు ఎకో సిస్టమ్ లో మార్పు వస్తుంది.
హైదరాబాద్ లో రహేజాకు నాలెడ్జి సిటీ ఎందుకు అన్నారు, ఈరోజు అక్కడ లక్షమంది పనిచేస్తున్నారు. విమర్శకుల మాట వింటే అది వచ్చేది కాదు. చంద్రబాబు విజన్ ఉంది కాబట్టే పెట్టుబడులు రప్పించగలుగుతున్నాం. ప్రజలు విజనరీకి, ప్రిజనరీకి తేడా గమనించాలి. చంద్రబాబు కృషివల్ల ఎపి తలసరి ఆదాయం పెరిగింది. గతంలో విజన్ 2020 అమలుతో హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి సాధించింది.
సైబరాబాద్, ఐఎస్ బి, శంషాబాద్ ఎయిర్ పోర్టు విజన్ తోనే సాధ్యమయ్యాయి. ఈరోజు తెలంగాణా ఆదాయంలో ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్టుతోనే 12శాతం వాటావస్తోంది. ప్రిజనరీ లక్షణం వచ్చిన పెట్టుబడులు చెడగొట్టడం, తరిమేయడం. డేటా సెంటర్ తో ఏదో అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు. టిసిఎస్, కాగ్నిజెంట్ పై వైసిపి వాళ్లతో పిల్ వేయించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తే సమస్య ఏమిటో అర్థం కావడం లేదు.
వచ్చేనెలలో కీలక ఎనౌన్స్ మెంట్స్
నవంబర్ లో మరికొన్ని కీలక ఎనౌన్స్ మెంట్ ఉంటాయి. విమర్శకుల మాటలు పట్టించుకుంటే ఆనాడు హైదరాబాద్ కు ఐఎస్ బి వచ్చేది కాదు. ఈరోజు ఒక్క ఇన్వెస్టిమెంట్ పక్కరాష్ట్రానికి వెళ్తుంటే నేనే రంగంలోకి దిగుతున్నా. వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ అయితేనే వైబ్రంట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. నవంబర్ లో శుభవార్తలు ఉంటాయి. గూగుల్ సంస్థ సౌత్ ఈస్ట్ ఏసియాలో పెట్టుబడి పెట్టాలని భావించినపుడు నేను వారిని అప్రోచ్ అయ్యాను. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సంప్రదించాను.
కేంద్రం, రాష్ట్రాల్లో 3,4 పాలసీ సమస్యలు ఉంటే పరిష్కరించాం. ఎపిలో ఇప్పుడు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. మేము ఇతర రాష్ట్రాలతో పెట్టుబడుల విషయంలో పోటీ పడుతున్నాం. గూగుల్ రాకతో భారత్ గెలిచింది. మేకిన్ ఇండియా పాలసీపై ప్రధాని సీరియస్ గా పనిచేస్తున్నారు. పరిశ్రమలకోసం ఇతర రాష్ట్రాలతో పోటీపడటంలో తప్పులేదు.
ఆనాడు ప్యాలెస్ తప్ప ఒక్క పెట్టుబడిలేదు
జగన్మోహన్ రెడ్డి హయాంలో రూ. 700 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు. మేం వచ్చాక టిసిఎస్, ఎఎన్ఎస్ఆర్, సత్వా వంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం. ఆరోజు ఐటి మంత్రినిపెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్పారు. విశాఖ ఐటి కంపెనీల ప్రతినిధులు కేవలం బస్సులు వేయమంటే అది కూడా చేయలేకపోయాడు.
మేం వచ్చిన వెంటనే బస్సులు వేశాం. ఆయనకు డేటా సెంటర్ల గురించి ఏమి తెలుసు? విశాఖలో వైసిపి హయాంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టారు. అప్పుడు కంపెనీ పేర్లు అడిగితే ఒక్క పేరు చెప్పలేకపోయారు. మేం కూడా వచ్చేనెలలో పార్టనర్ షిప్ సమ్మిట్ పెడుతున్నాం. అయితే ఆ సమ్మిట్ కోసం ఆగకుండా వేగంగా ముందుకు వెళ్తున్నాం. గూగుల్ సంస్థ అయిదేళ్లలో 15 బిలియన్లు పెట్టుబడి పెడుతుంది. వారికి డేటా సెంటర్ పాలసీ ప్రకారం క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం. ఎపిఈఆర్ సి నిర్ణయించిన టారిఫ్ పై విద్యుత్ సబ్సిడీ ఇస్తాం.
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. గూగుల్ ను రప్పించేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి మద్దతునిచ్చారు. విమానయాన పాలసీ, టెలికం రెగ్యులేషన్ పాలసీల మార్పుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆయారంగాలు అభివృద్ధి సాధించాయి. జాతీయ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో కలసి పనిచేశాం. మున్ముందు ఎంతో వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నాం. బిపిసిఎల్ రిఫైనరీకి శంకుస్థాపన చేయబోతున్నాం. వచ్చేనెలలోనే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు భూమిపూజ చేయబోతున్నాం.
17నెలల్లోనే ఇన్ని పనులు చేయగలిగాం. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ద్వారా ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం. మెయిన్ హబ్ అమరావతిలో, నోడ్స్ మేజర్ సిటీల్లో పెట్టాం. సమర్థవంతంగా పనిచేసేందుకు యువ ఐఎఎస్ అధికారిని నియమించాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుచేసి మానిటర్ చేస్తున్నాం. నవంబర్ టిసిఎస్ క్యాంపస్, డిసెంబర్ కాగ్నిజెంట్ విశాఖకు వస్తున్నాయి. నిరంతర ఫాలో అప్ తోనే ఇది సాధ్యమవుతోంది.
గూగుల్ తో కలిసి ఏఐ నైపుణ్య శిక్షణ
రాష్ట్రంలోని యువతలో ఎఐ నైపుణ్యాలను పెంచేందుకు గూగుల్ తోపాటు టిసిఎస్, కాగ్నిజెంట్ తో కలసి పనిచేయాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇందుకోసం కృషిచేస్తుంది. ప్రాజెక్టులు తేవడంతోపాటు సమాంతరంగా స్కిల్ డెవలప్ మెంట్ కూడా చేస్తాం. ఇప్పటివరకు రాష్ట్రానికి 125 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కమిట్ మెంట్స్ వచ్చాయి. కొత్త పెట్టుబడులపై దృష్టిసారిస్తున్నాం. ఈనెల 18నుంచి 25 వరకు ఆస్ట్రేలియా వెళ్తున్నాం. కొందరు రాష్ట్రానికి రాకుండా చేసేందుకు గూగుల్ వాళ్లకు కూడా మెయిల్స్ పెట్టారు. గతంలో సింగపూర్ పారిశ్రామికవేత్తలకు కూడా ఇలాగే మెయిల్స్ పెట్టారు.
అన్నిరంగాల్లో ఎపిని నెం.1 చేయాలన్నదే మా లక్ష్యం. గతంలో కంప్యూటర్ అన్నం పెడుతుందా, ఎయిర్ పోర్టుతో ఉద్యోగాలు వస్తాయా అన్నారు. చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారిని కన్విన్స్ చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఈసారి సెక్టార్ లో మారింది, స్కేల్ పెద్దది. విద్యుత్ సంస్కరణల అమలుతో యూనిట్ 13పైసలు తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.800 కోట్లు లబ్ధి చేకూరింది. ఇంకా విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. టాలెంటెడ్ యూత్, ట్రాక్ రికార్డు గల ముఖ్యమంత్రి, చౌకధరతో రెన్యువబుల్ ఎనర్జీ మా ప్రత్యేకతలు.
విశాఖలో 6 గిగావాట్ల డాటా సెంటర్లు మా లక్ష్యం
విశాఖపట్నంలో సిఫీ సంస్థ 500 మెగావాట్ల డాటా సెంటర్ కు భూమిపూజ చేసింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో 6గిగావాట్ల డాటా సెంటర్స్ ఏర్పాటుచేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ పరిధిలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. 2014లో చంద్రబాబు రెన్యువబుల్ ఎనర్జీకి పునాది వేశారు. పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు వచ్చాయి. గత ప్రభుత్వం విశాఖలో వెయ్యి మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టును చంపేసి యూనిట్ 18రూపాయల చొప్పున కొన్నారు. ఇప్పుడు గతంతో పోలిస్తే కేవలం 10శాతం మాత్రమే కొంటున్నాం.
గత పాలకుల అసమర్థత వల్ల విద్యుత్ చార్జీలు పెరిగాయి. ట్రూ డౌన్ మా విధానం. మాది నాయుడు 4.0 టీమ్… ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్లే కలసి పనిచేస్తున్నాం. మేం భారతదేశం గర్వపడేలా పని చేస్తున్నాం. గత ప్రభుత్వం పిపిఎల రద్దు చేయడంతో ప్రజలు 9వేలకోట్ల భారం మోయాల్సి వచ్చింది. వారి చర్యలతో పలు ఆర్థిక సంస్థలు ఎపిలో పెట్టుబడులు రిస్క్ అనే పరిస్థితి కల్పించారు.
పేద విద్యార్థులకు మేలు చేసేందుకే పీపీపీ
మెడికల్ కాలేజిలను త్వరితగతిన పూర్తిచేసి పేద విద్యార్థులకు మేలు చేసేందుకు పిపిపి విధానాన్ని తెచ్చాం. మెడికల్ కాలేజి అన్ని కట్టాలంటే ఆర్థికంగా ఇబ్బందుల వల్ల ప్రభుత్వానికి సాధ్యం కాదు. అందుకే పిపిపి విధానం తెచ్చాం. గతంలో పేద విద్యార్థులకు 42శాతం సీట్లు ఇస్తే, పిపిపి కళాశాలల్లో 50శాతం సీట్లు నిరుపేదలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పాం. నాణ్యత పెంచాలి, మెరుగైన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. పిపిపి అంటే అమ్మకం కాదు. మేం ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదు. కేవలం పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. ఈ విషయంలో వైసిపి వారికి క్లారిటీ లేదు. పిపిపిలో పనిచేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ మంచిదైనపుడు మెడికల్ కాలేజిలు తప్పెలా అవుతాయి.
వైసీపీ ఆంధ్రరాష్ట్ర ఆరోగ్యానికి హానికరం. అయిదేళ్ల వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయాం. సానుకూల దృక్పథంతో మేం ముందుకెళ్తున్నాం. వైసీపీ నాయకులకు తెలిసిన పరిశ్రమలు ఉన్నా ఆహ్వానిస్తాం. మంచి కంపెనీలు ఉంటే రప్పించి ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. దీనివల్ల ఆంధ్రరాష్ట్రం గెలుస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు, కులాల మధ్య చిచ్చుపెడితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.