ఉద్యోగులపై మేం ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉద్యోగుల డిమాండ్లను మేం కాదనడం లేదు. ఉద్యోగులు చర్చలకు రావాలి కదా..? జీవోలు రద్దు చేయడం కుదరదు. జీవో లో అవసరమైతే మార్పులు చేస్తాం. ఉద్యోగులను ఎక్కడా భయపెట్టలేదు. అశుతోష్ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు చూసినా ఉపయోగం లేదు.సీపీఎస్ను రద్దు చేయాలనే సానుభూతితో ఉన్నాం. ఉద్యోగస్తులు వ్యవస్థలో భాగస్వాములు. చర్చలకు రాకుండా ఉద్యోగులు చెప్పిందే జరగాలంటే ఎలా?