నిజాం చరిత్ర.. వాస్తవికత

స్వాతంత్ర్యం సిద్దించడానికి పూర్వం భారతదేశంలో ఆంగ్లేయులు నేరుగా పాలించిన ప్రాంతాలే కాక, దాదాపు 500 పైచిలుకు సంస్థానాలుండేవి. అన్నింటికంటే పెద్ద సంస్థానం హైదరాబాద్. దీని విస్తీర్ణము 82,698 చ.మై. అతి చిన్న సంస్థానము గుజరాత్ లోని “బిల్బరి.” అప్పటి నిజాం సంస్థానంలో 88% హిందువులు బానిసలే.

నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ 1911లో పట్టాభిషిక్తుడు అయినాడు. ఈయనకు 42 మంది ఉంపుడుగత్తెలు, 7గురు భార్యలు, మొత్తం 149 మంది సంతానం. పెద్ద భార్య కొడుకు AZAM ZA మీర్ హిమాయత్ అలీఖాన్. ఈయనకు 1931లో ఖలీఫా కూతురుతో పెళ్ళైంది. రెండో కొడుకు మీర్ షుజాత్ అలీఖాన్ కు ఖలీఫా దగ్గరి బంధువు కూతురుతో పెళ్ళి జరిగింది.

నిజాం తన రాజ్యాన్ని పూర్తి స్థాయి ముస్లిం రాజ్యంగా మార్చే ప్రక్రియ మొదలెట్టాడు. అందుకు ఆయన మొదట విద్యారంగాన్ని ఎంచుకొన్నాడు. హిందువులు స్వయంగా నడుపుకునే ఖాన్గీ బడులను నియంత్రించటం మొదలెట్టాడు. 4053 పాఠశాలల నుండి 776 కు తగ్గిపోయాయి. విద్యార్థుల సంఖ్య 76,654 మంది నుండి 27,506 కు తగ్గింది. “సుల్తాన్-ఉల్-ఉలూమ్” అంటే విద్యలరాజుగా బిరుదు తగిలించుకొన్న ఈయన 1929లో నారాయణగూడాలో ఒక బాలికోన్నత పాఠశాల స్థాపిస్తే అది హిందువులదనే మిషతో అనుమతి నిరాకరించాడు. గత్యంతరం లేక నిర్వాహకులు కార్వే విశ్వవిద్యాలయం నుండి అనుమతి తెచ్చుకొన్నారు.1917లోనే తెలుగు మీడియం నిషేదించాడు. 1918లో అక్బర్ హైదరీ ప్రోద్భలంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించాడు. కానీ అందులో FACULTY OF THEOLOGY అనే ముస్లిం మత విద్య ప్రవేశపెట్టాడు. 1938లో వందేమాతర ఉద్యమాన్ని నిషేధించాడు…….
ఇస్లాం సిద్ధాంతం ప్రకారం అల్లా ఒక్కడే దేవుడు. సృష్టిని కాదు, సృష్టికర్తను ప్రార్దించాలనేది వారి విశ్వాసం. విగ్రహారాధన, ప్రకృతి ఆరాధన, వ్యక్తి పూజకు ఇస్లాం వ్యతిరేకం. కాని నిజాం ప్రభువు స్థుతింపుతోనే విద్యా సంస్థలు ప్రారంభమయ్యేవి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయలకు శుక్రవారం సెలవుండేది. ముస్లిం పండుగలకు సెలవుండేది. ఇక హిందువులు పండుగలు జరుపుకోవడం చాల కష్టతరమైనది.

ప్రభుత్వోద్యాగాలు 90% పైచిలుకు ముస్లింలకే దక్కేవి. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్లోపన్యాసాకులు “అబ్దుల్ లతీఫ్” EXCHANGE OF POPULATION జనాభా మార్పిడి అనే సిద్ధాంతం ప్రతిపాదించాడు. దీని ప్రకారము హిందువులు హింసకు గురికాకుండా వుండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి పోవాలి. ఇక్కడ ముస్లిం జనాలతో నింపేయాలి. ఈ సిద్ధాంతం ప్రభావము వల్ల 1948 వరకు 8 లక్షల ముస్లిం జనాభా వచ్చి చేరారంటే హిందువులు ఎంత హింసకు గురైనారో తెల్సుకోవచ్చు.

అంజుమనే తబ్లిగ్ ఇస్లామ్ అనే సంస్థ మతమార్పిడులు చేసేది. దీనికి విరుగుడుగా ఆర్యసమాజం శుద్ది ఉద్యమం ద్వారా మతం మారిన వారిని తిరిగి హిందూమతంలోకి పునరాగమనం చేయించేవారు. ఆర్యసమాజం 1892లో సుల్తాన్ బజారులో ప్రారంభమైంది. అంజుమనే తబ్లిగ్ ఇస్లాం పీసర వీరన్న అనే దళితున్ని సర్దార్ అలీ గాను, దొడ్డి కొమురయ్య సొంత అన్న దొడ్డి మల్లయ్య ను ఖాదర్ అలీ గా మార్చింది. నిజాం తను సెక్యులర్ అనిపించుకోవాలని ఆర్యసమాజం మరియు అంజుమనే తబ్లిగ్ ఇస్లాం సంస్థలను నిషేధించాడు. కానీ మరోవైపు 1920లో బహాదూర్ యార్ జంగ్ ఆధ్వర్యంలో MIM మజ్లీస్ ఇత్తే హాదూల్ ముస్లిం అనే సంస్థ నిజాం ఆశీస్సులతో ప్రారంభం అయ్యింది..
MIM మొదట ఒక సాంస్కృతిక సంస్థగా ప్రారంభమయ్యింది. కాని అనతి కాలంలోనే పూర్తి మతోన్మాద సంస్థగా అవతరించింది.

బహాదూర్ యార్ జంగ్ ఆకస్మిక మరణం తరువాత అబుల్ హసన్, తరువాత మజహర్ అలీ కమాల్, తదుపరి ఖాసీం రజ్వీ, ఆ తరువాత సలావుద్దిన్ ఒవైసి, అసదుద్దిన్ ఒవైసి అధ్యక్షులయ్యారు. MIM ముఖ్య లక్ష్యం మతమార్పిడులు మాత్రమే కాదు ఇతర ప్రాంతాలనుండి పెద్ద మొత్తంలో ముస్లింలను దిగుమతి చేయటం. MIM హిందువులపై చేసిన దురాగతాలు చరిత్రలో మాయని మచ్చలని ప్రముఖ తెలంగాణా పోరాట యోధుడు “రఘువీర్ నారాయన్ లక్ష్మికాంత్ శ్రీనివాస్ రామ్ రాజా కాళోజి ” పేర్కొన్నాడు.
నిజాం పాలనలో వ్యక్తి స్వేచ్ఛ, భావప్రకటన అనేదే లేదు. తెలుగులో ఒక పత్రిక స్థాపించడానికి నానా యాతన పడాల్సి వచ్చింది. చివరకు “గోలకొండ ” అనే పేరు పెడితే గాని అనుమతి లభించలేదు.
కాళోజి నారాయన్ రావుగారు, పెండ్యాల రాఘవరావుగారు మరికొందరు ఆర్యసమాజం సభ్యులు వరంగల్ తాలూకా పల్లగుట్ట, రాజారాం గ్రామాలలో పర్యటించి, MIM చేత బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డ దళితులను తిరిగి “శుద్ధి ” కార్యక్రమం ద్వారా హిందూధర్మంలోకి పునరాగమనం చేయించారు.

హిందూధర్మం పై కుట్ర – 1
నిజాం ప్రభుత్వంలో “ఉమూర్ మజహార్” అనే దేవాదయ శాఖా ద్వారా “దీన్ దార్” అనే సంస్థకు నిధులందేవి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని “ఆసీఫ్ నగర్ “లో వుంది. దీన్ దార్ నాయకుడు “సిద్దీఖీ దీన్ దార్”. ఈయన తనకుతాను చెన్న బసవేశ్వరుడి అవతారుడుగా చెప్పుకొన్నాడు. 1929 లో లింగాయత్ సాంప్రదాయానికి ఆధునిక రూపమే ఇస్లాం అనే వాదన చేశాడు. హిందూదేవతలను అవమాన పరుస్తూ, హిందువులంతా ఇస్లామ్ లోకి మారాలని ప్రచారం చేసేవాడు. మతమార్పిడులు చేసేవాడు. తను కల్కి అవతారమాని, వీరభోగవసంత రాయడనని, నిజాం అవతార పురుషుడని, అతని ప్రస్తావన వేదాలు, ఖురాన్ లో వుందని వంచించే ప్రయత్నం చేశాడు. హిందూ దేవాలయాలు ద్వంసం అవుతాయని, గాంధీ ఇస్లామ్ స్వీకరిస్తాడని, నెహ్రూ మానసికంగా ముస్లిం అవుతాడని జోస్యం చెప్పాడు. హుబ్లీ, ధార్వాడ్, గుల్బర్గా, బీదర్ లలో అనేక మంది మతమార్పిడి గావింపబడ్డారు. కాని చాలామందిని తిరిగి హిందూధర్మం లోకి ఆర్యసమాజం తీసుకొని వచ్చింది. అందువల్ల ఆర్యసమాజం నాయకుడు అయిన స్వామి శ్రద్దానందను 1926 డిసెంబరు 23 న నిజాం హత్య చేయించాడు…………

హిందూ మతం పై కుట్ర-2
బీహార్ నుండి సర్ అలీ ఇమాం, సర్ హసన్ ఇమాం అను ఇరువురు నిజాం సంస్థానానికి వచ్చారు. సర్ అలీ ఇమాంను తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు నిజాం. వీరు మంచి విద్యావంతులు, కాని ఒక కొత్త కుట్రకు తెర లేపాడు సర్ అలీ ఇమాం. అదేమిటంటే గోదావరి లోయ, రామగుండం, గోదావరి ఖని, పాల్వంచ, చెన్నూరు, ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో అఫ్ఘనిస్తాన్ లోని వజీరిస్తాన్ నుండి వేలాది పఠాన్ కుటుంబాలను తరలించి, స్థానిక హిందువులను తరిమేయాలని చూశాడు. కాని ఈ కుట్ర మధ్యలో ఆగిపోయింది. హసన్ ఇమాం తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

హిందూ మతం పై కుట్ర-3
అల్లా మమష్రకి అనే వాడి పర్యవేక్షణలో “ఖాక్సర్”పార్టీ ని స్థాపించారు. ఇందులోని సభ్యులను “బేల్ఫా ఫౌజ్” అనే వారు. “బేల్ఫా”అంటే గొడ్డలి. గొడ్డలి ద్వారా హిందువులను అంతం చేయడమే ఈ పార్టీ ముఖ్యోద్దేశం.

హిందూ మతం పై కుట్ర – 4
హిందూ నగరాల పేరు మార్పు.
1.భాగ్యనగర్ -హైదరాబాద్.
2.వీరపట్టణం-ఇబ్రహీం పట్నం.
3.ఇందూరు -నిజామబాద్.
4.పాలమూరు-మహాబూబ్ నగర్.
5.మానుకోట-మహబూబా బాద్.
6.ఎదులాపురం-ఆదిలాబాద్.. ఇలా ఎన్నో ఉన్నాయి.

హిందూ మతం పై కుట్ర – 5
హిందువులను ఆర్థికంగా అణిచివేసి తద్వారా మతమార్పిడి చేయాలని నిజాం భావించాడు. అందుకోసం MIM/రజాకార్లను వాడుకొన్నాడు.
1.హిందువుల పై పన్నులు పెంచడం.
2.రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని రజాకర్లచే ధ్వంసం చేయించటం లేదా దొంగిలించటం.
3.విద్యా, ఉపాధి అవకాశాలు దెబ్బతీయటం.
4.దాదాపు 88% ఉన్న తెలుగు ప్రజలకు విరుద్ధంగా ఉర్దూ ను ప్రవేశపెట్టడం. నిజానికి పాకిస్తాన్ పిత అయిన “మహ్మద్ అలి జిన్నా” కు ఉర్దూ రాదు. ఆయన మాతృభాష గుజరాతి.
5.మిల్లు కార్మికుల సంఖ్య 20 వేలు అయితే అందులో 15 వేలమంది ముస్లింలే.
6.ప్రభుత్వోద్యోగులు 60 వేలయితే 46 వేల మంది ముస్లింలే.
7.పోలీసుల సంఖ్య 52000 అందులో 46000 పైచిలుకు ముస్లింలే.

నిజాం రాజు మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ వారికి ఆర్థిక సహాయం అందించాడు. అందుకుగాను “HIS EXALTED HIGHNESS” అనే బిరుదు పొందాడు. నిజాం క్రైస్తవుల యెడ ఉదారంగా వుండేవారు. కాని 1914లో ప్రారంభమైన మెదక్ పాస్నెంట్ చర్చ్ 1924 లో పూర్తి అయ్యింది. ఈ చర్చ్ చార్మినార్ కంటే ఎత్తుండకూడదని 173 అడుగుల కే అనుమతించాడు. చార్మినార్ ఎత్తు 175 అడుగులు.

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఒక ధన పిశాచి
1.సర్ఫే ఖాస్ నుండి వచ్చే ఆదాయం కాకుండా సంవత్సరానికి 70 లక్షాల ప్రజాధనం వాడుకునేవాడు.
2.కోఠీలో కమాల్ ఖాన్ అనే పెద్ద జాగీర్ధార్ అద్భుతమైన భవనం నిర్మించుకొన్నాడు. అది చూడడానికి వచ్చిన నిజాం దాని అందానికి ముగ్దుడై, ఆ భవనాన్ని తనకు బహుమతిగా ఇవ్వాలని ఆదేశించాడు. దాంతో చేసేది లేక కమాల్ ఖాన్ ఆ భవనాన్ని ఇచ్చాడు. అదే కాలక్రమంలో కింగ్ కోఠి గా పిలువబడుతోంది.
3.ఎవరైనా రెండు అష్రఫీలు (తులం బంగారం ) నజరాన ఇస్తే, జంగ్, నవాబ్ జంగ్, యార్ జంగ్ బిరుదులు ఇచ్చేవాడు.
4.భూమిశిస్తుతో పాటు ప్రతీ రూపాయికి ఒక అణా లోకల్ ఫండ్, అర అణ బంచ్ రాయ్, ఒక అణా నిజాంకు నజరాన ఇచ్చేవారు.
5.”సాల్ గిరా”అనే రాజు పుట్టిన రోజు పండగకు కానుకలు సమర్పించటం ఆనవాయితీ.
6.జాగిర్దార్లు చనిపోతే వారసుల నుంచి నజరాన స్వీకరించి ఆస్తి మార్పిడి చేయటం, వారసులు కనుక లేకపోతే ఆస్తి జప్తు చేయటం జరిగేది.
7.నిజాం ప్రతిరోజూ కొత్త బట్టలు ధరించే వాడు. బట్టలు కుట్టడానికి ఆస్థాన దర్జీలు ఉండేవారు.
8.నగరంలో ఎవరైనా కొత్తకారు కొంటే, అది గనుక నిజాం కు నచ్చితే చాలు, అది దక్కించుకొనేవాడు. ఇలా వందకార్ల పై చిలుకు దక్కించుకొని, ప్రపంచంలోనే అత్యధిక కార్లు వున్న రాజుగా పేరుగాంచాడు.
9.నిజాం పర్యటనకు వెళుతున్నప్పుడు మధ్యలో పెళ్ళిళ్ళు జరుగుతుంటే, ఆ పెళ్ళి కూతుళ్ళు గనుక నిజాంకు నచ్చితే వెంట తీసుకెళ్ళేవాడు.

రజాకర్ల/MIM ల నరమేధం
1.నవంబర్ 2,1946లో పాత సూర్యాపేట పై అర్థరాత్రి దాడిచేసి అమాయక జనాలను ఊచకోత కోయడం.
2.డిసెంబర్ 1,1946 నాడు మల్లారెడ్డిగూడెంపై దాడిచేసి చింద్రాల గురవమ్మ, బొండమ్మ, అంకాలమ్మ అనే దళిత మహిళలను అవమానకర పద్దతులలో చంపారు.
3.ఆగస్ట్ 11 1946లో ఆదివారం రోజున వరంగల్ తూర్పు కోట ముస్లిం లు మరియు 200 మంది రజాకర్లు ఖాసీం షరీప్ నాయకత్వంలో మొగిలయ్య గౌడ్ ఇంటిపై దాడిచేసి, అతని పొట్టలో బర్సిని దింపి పేగులు బయటకు లాగి చంపాడు షరీఫ్. మొగిలయ్యగౌడ్ అన్న అయిన రామస్వామి గౌడ్ ను కూడా కిరాతకంగా చంపి వారి రక్తాన్ని షరీఫ్ తన ముఖానికి రాసుకొని వారి తల్లిని కొట్టి, విజయగర్వంతో బర్సిని పైకెగరేసుకుంటూ వరంగల్ నగరంలో ఊరేగాడు.
4.ఆగస్టు 14, 1946లో ప్రముఖ డాక్టర్ నారాయణ రెడ్డిగారు పేదల వైద్యుడు గా పేరొందాడు. ఆయన వద్ద ముస్లింలు కూడా ఉండేవారు. అందులో వరంగల్ నగర MIM అధ్యక్షులుకూడా వున్నారు. కాని ఆ డాక్టరు ను చంపిన వారిలో MIM అధ్యక్షుడు ప్రధాన సూత్రదారి అని కాళోజి నారాయణరావు ఆరోపించారు.
5.మార్చ్ 14.1948 లో హుస్నాబాద్ కు సమీపంలో మంగాపురం కొండలవద్ద కరినగర్ సింహాం, అనభేరి ప్రభాకర్ రావును మరియు మరో 9 మందిని అతి కిరాతకంగా చంపారు.
6.మార్చ్ 14 1948 లో బసిరెడ్డి పల్లెలో సిరిసిల్లా తాలూకా ముద్దుబిడ్డ సింగిరెడ్డి భూపతి రెడ్డిగారిని దారుణంగా చంపారు.
7.మిట్టా యాదవ రెడ్డి సహా తాటికొండ పోరాటంలో 30 మంది యువకులను రకరకాలుగా హింసించి జీవచ్ఛవాల్లాగా మార్చారు.
8.సెప్టెంబర్-1 1948 లో జోడేన్ ఘాట్ లో కొమురం భీం సహ 12 మంది గిరిజనులను అమానుషంగా హత్య చేయటం.
9.పాలకుర్తిలో చాకలి ఐలవ్వ పోరాట తీరు మరువ లేనిది.
10.వేంకటేశ్వర పల్లే మక్తేదార్ మొఘల్ మియా అలియాస్ సలావుద్దిన్. ఈయన ఆకృత్యాలు చెప్పనలవి కానివి. అందమైన స్త్రీలు కనిపిస్తే చాలు, వారిని వారి కుటుంబ సభ్యుల ముందే రేప్ చేసేవాడు. ఎదురుతిరిగితే వారి ఇండ్లు, గడ్డివాములు ధ్వంసం చేసేవాడు.
11.హిందూ స్త్రీలను ముస్లింలు అపహరించుకు పోవటం పరిపాటి. “ఓడపల్లి సత్తెయ్య అనే దర్జీ కూతురును మహ్మద్ ఖాసీం ఎత్తుకెళ్ళాడు. ఇంకా కొత్తగట్టు జనార్దన్ కూతురును, మొగళ్ళపల్లెలో ఒక విశ్వబ్రాహ్మణ స్త్రీని, రాజుపేటకు చెందిన ఒక మూగ స్త్రీ ని ముస్లింల చెరనుండి ఆర్యసమాజం కాపాడింది. ఇలాంటి సంఘటనలు వేలాదిగా జరిగాయి. ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే.
12. 1947 ఫిబ్రవరి లో హుజూరాబాద్ తాలూకా మల్లంపల్లి కి చెందిన గోనే కొమురయ్యను పశువుల కొట్టంలో కట్టివేసి నిప్పంటించి సజీవ దహనం చేశారు.
13.ఆగస్టు 21 1948 న రాత్రి 10 గంటలకు ఇమ్రోజ్ పత్రికా స్థాపకులు షోయబుల్లాఖాన్ ను చంపి శరీరాన్ని ముక్కలు చేసి తలను ఖాసీం రజ్వీ కి బహుమతి గా పంపాడు”అబ్దుల్ మునీం ఖాన్”.
14.చింతలగూడెం నివాసి, చింతపట్ల మల్లయ్యను పట్టుకొని ఆయన కొండనాలుకకు, పెద్దనాలుకకు సూదితో కుట్టు వేసి హింసించి, ప్రతి ఇంటినుండి ఒక కట్టెను అడుక్కోమని చెప్పి, ఆ కట్టెలపై అతన్ని సజీవ దహనం చేశారు.
15. 1947లో గాండ్లాపూర్ లో హిందూ స్త్రీల చే నగ్నంగా బతుకమ్మ ఆడించారు.
16.నేరడ గ్రామంలో 70 మంది స్త్రీలకు ఫైజామాలు తొడిగించి అందులోకి తొండలను వదిలారు.
17.మిర్యాలగూడ లోని నడిగడ్డ గ్రామంలో చాకలి లచ్చమ్మను తలకిందులుగా చెట్టుకు వేళాడదీసి చిత్రహింసలు పెట్టారు.
18. ఏప్రిల్ 10, 1948 న పాలమూరుజిల్లాలోని బోర్ పల్లి పై దాడిచేసి దళిత యువకుల పురుషాంగాలకు కిరోసిన్ తో తడిపిన గుడ్డలు కట్టి నిప్పంటించారు. వారు హాహాకారాలు చేస్తుంటే వారి భార్యలను మానభంగం చేశారు. ఆ అవమానం తట్టుకోలేక దళిత యువతులంతా ఆత్మహత్య చేసుకొన్నారు.
19.హిందూ స్త్రీల రొమ్ములను పట్టుకారుతో లాగడం, పిరుదులపై గిల్లటం, తల్లుల యెదుటే కూతుళ్ళను మానభంగం చేయటం సర్వసాధారణం.
20.జూలై 5 1948 న గుల్బర్గా లోని సైదాబాద్ లో 15 మందిని, హుజూర్ నగర్, మిర్యారగూడలోని నీలాయగూడెంలో 21మందిని, మానుకోట తాలూకా బలుపాలో 15 మందిని, ఇల్లందు తాలూకా సీమలపాడులో 70 మందిని, జనగామా తాలూకా నర్మెట, నంగునూరులో 80 మందిని చెరిచారు. నగరంలో ఒక స్త్రీని చెరిచి, చంపి రోడ్డు ప్రక్కన పడేసి పోయారు. భువనగిరి తాలూకా నారిగూడెంలో పచ్చిబాలింత పై, ఎనుపాడులో నిండుగర్భిణి పై అత్యాచారం చేశారు రజాకర్లు.
21. ఆగస్టు 27 1948 న 400 మంది నిజాం సైనికులు బైరాన్ పల్లి పై దాడిచేసి 118 మందిని వరుసగా నిలబెట్టి కాల్చిచంపారు. ఈ దాడిలో నల్గొండ జిల్లా కలెక్టరు మొహాజ్జం హూసేన్, డిప్యూటి కలెక్టరు ఇక్బాల్ హాసీం స్వయంగా కాల్పులు జరిపారు. శవాలన్నింటిని ఊరి బయట పాడుపడిన బావిలో పడేశారు. అందులో ఒక సజీవ శిశువు కూడా వున్నారు.

ఈ దాడితో ప్రభుత్వం కూడా ఇస్లాం రాజ్యస్థాపన కోసం ప్రయత్నించినట్లు ప్రపంచం గుర్తించింది. హిందువులను హింసించటం, వారి శరీర భాగాలను నరికి వారితోనే తినిపించటం అనేది MIM/రజాకర్లకు సంతోషాన్నిచ్చే ఒక పైశాచిక క్రీడ.
విడ్డూరమైన విషయం ఏమిటంటే సెప్టెంబరు 17ను మహారాష్ట్ర లో “మరాఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివస్” పేరున, కర్ణాటకలో “హైదరాబాద్-కర్ణాటక విభజన దినం” పేరున ప్రతి సంవత్సరం అధికారికంగా, నిర్వహిస్తూ, జాతీయ జండా ఎగురవేస్తారు. _పోరాటయోధుల కుటుంభ సభ్యులను/వారసులను సత్కరిస్తారు.
పదండి ముందుకు ……..తెలంగాణ విమోచన దినం జరిగే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం..!

సంప్రదించిన పుస్తకాలు
1.తెలంగాణా సాయుధ పోరాటం
2.హైదరాబాద్ జీవిత చరిత్ర

– హరికృష్ణ

Leave a Reply