– గెలవడం చేతకాక క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారు
– పదికోట్లకు పరువునష్టం దావా వేస్తా
– ఏదో ఒక సందర్భంలో ఫోటో దిగితే సపోర్టు చేసినట్లేనా?
– మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి నాతో ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో తెలియదు. నవీన్ యాదవ్ కు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు.
ఫాల్తు మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తో ఉన్నాను. నా తండ్రి తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని వచ్చాను. ఉద్యోగంలో ఉండి జైలుకి వెళ్ళాను. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నా తమ్ముడిని 40 రోజులు జైల్లో పెట్టారు.
నేను ఒకే పార్టీలో ఉన్నాను, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. నా క్యారెక్టర్ ను దెబ్బతీస్తున్నారు. నా జీవితం మొత్తం కేసీఆర్ తోనే ఉంటాను. గెలవడం చేతకాక క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తాము. వారిపై పదికోట్లకు పరువునష్టం దావా వేస్తా.
ఏ బుక్ లేదన్న డీజీపీ ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు? కాంగ్రెస్ వాళ్ళను మాత్రమే డీజీపీ కాపాడతారా ఫోటోలో ఏదో ఒక సందర్భంలో దిగితే సపోర్టు చేసినట్లేనా? సెటిల్ మెంట్లు చేసిన వాళ్ళను, రేప్ కేసులో ఉన్న వాళ్ళను వెంట తిప్పుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు. మాగంటి సునీత గెలుస్తుందనే అసత్య ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ చేసినట్లు బీసీలకు ఎవరూ మేలు చేయలేదు. మీలాగా మేము చెట్టు కొమ్మను నరుక్కోము. కాంగ్రెస్ అఫీషియల్ ఫేస్ బుక్ లో నాపై పోస్టు పెట్టారు మీకు సిగ్గు ఉందా? ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను జీవితాలతో ఆటలు ఆడవద్దు. మా కుటుంబ సభ్యులను వేధించినా మేము భయపడలేదు. పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా పార్టీ మారలేదు.
ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.