Suryaa.co.in

Andhra Pradesh

బీసీల ఆత్మగౌరవం పై దెబ్బ తీస్తే, వైసీపీకి పుట్టగతులు ఉండవు

– రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్

బీసీల ఆత్మగౌరవం పై దెబ్బ తీస్తే వైసిపికి పుట్టగతులు ఉండవని, అయ్యన్నపాత్రుడి అరెస్టు బీసీల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగానే భావిస్తున్నట్టు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. బలమైన బీసీ నాయకత్వాన్ని అణిచి వేయటమే లక్ష్యంగా జగన్‌మోహన రెడ్డి అరాచక పాలన సాగుతోందన్నారు.

వేదవ్యాస్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్.అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.అయ్యన్నపాత్రుడి అరెస్టుతో జగన్మోహన రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. బీసీలంతా వైసిపికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ రోజులు అతిత్వరలో వస్తాయని వేదవ్యాస్ అన్నారు.అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు.అయ్యన్నను తక్షణమే విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేద వ్యాస్ అన్నారు.

 

LEAVE A RESPONSE