– బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: పెంచిన బస్ చార్జీలు వెంటనే తగ్గించాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు డి . సుధీర్ రెడ్డి , కాలేరు వెంకటేష్ ,ముఠా గోపాల్ డిమాండ్ చేశారు .చార్జీల భారం ప్రయాణీకుల పై ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంగళ వారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చార్జీల పెంపు పై ప్రయాణీకులు తమ నిరసన వ్యక్తం చేశారు .పేదల పై నెలకు ఐదు వందల రూపాయల దాకా అదనపు భారం పడుతుందని వారు వాపోయారు .కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణీకులు నినాదాలు చేశారు .అసెంబ్లీ దగ్గర బస్సు దిగిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బస్ స్టాప్ లో మీడియా తో మాట్లాడారు .
సామాన్య ప్రజల పై చార్జీల మోత తో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక సర్కార్ అని రుజువైందని ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి ,కాలేరు వెంకటేష్ ,ముఠా గోపాల్ వ్యాఖ్యానించారు .ఇప్పటికే వాహనాల పన్ను పెంచారు .మద్యం ధరలు పెంచారు .ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చార్జీల పెంపునకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు.
చార్జీల పెంపుతో ఆర్టీసీ ని మరింత దివాళా తీసే లా కుట్ర పన్నారని ఆరోపించారు .బస్ పాస్ చార్జీలు పెంచి విద్యార్థుల పై భారం మోపారు .ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచి అందరి పై అదనపు భారం మోపాన్నారు .మార్పు మార్పు అంటే సామాన్య ప్రజలపై అధిక భారం మోపడమేనా వారు ప్రశ్నించారు .బీ ఆర్ ఎస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని ఈ ప్రభుత్వం పై చార్జీలు దించేదాకా ఒత్తిడి పెంచుతుందని వారు స్పష్టం చేశారు .