సరిహద్దుల్లో కమ్మకుంటున్న యుద్ధ మేఘాలు

– భారీగా మోహరించిన ఇరు దేశాల సైనికులు
తూర్పు లద్దాఖ్‌ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్‌ ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతోంది. లద్దాఖ్‌లో మళ్లీ అలజడి సృష్టిస్తోంది డ్రాగన్‌.. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అన్ని ఏర్పాటు చేసినట్టు భారత ఆర్మీ. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై భారత్- చైనాలు తమ పట్టును బిగించాయి.
చైనా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు నిపుణులు. సైనిక కార్యకలాపాలను పెంచడం. మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే రెండు వైపుల నుండి నిరంతర పర్యవేక్షణపై నాలుగు వారాల చర్చలు జరిగినప్పటికీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పారు.
హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇరువైపులా క్లిష్ట పరిస్థితుల కారణంగా సైనిక చర్చలు ప్రస్తుతం విజయవంతం అయ్యే అవకాశం లేదని..ఈ సందర్భంలో పై నుండి జోక్యం చేసుకోవడం మాత్రమే 18 నెలల సరిహద్దు సంక్షోభాన్ని పరిష్కరించగలదని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యకు ప్రతిస్పందనగా సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాలు ఉన్నాయని..ఎలాంటి విపత్తు కార్యకలాపాలను ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా తీసుకున్నట్లుగా మరో అధికారి వెల్లడించారు.

Leave a Reply