Suryaa.co.in

Telangana

ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసుల రాజ్యం

– ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదు
– గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

గచ్చిబౌలి: పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని బంజారాహిల్స్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఏసీపీ లేకపోవడంతో సీఐను ఫిర్యాదు తీసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారు. సిఐని ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారు.

ఉదయం 10 గంటలకు అరెస్టు చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి,ఇతర నేతలను అరెస్టు చేశారు. ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదు.

ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు ఉపసంహరణ చేయాలి. ఎమ్మెల్యేలను కోర్టు మూసిన తర్వాత పంపించాలనే జాప్యం చేస్తున్నారు.

ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసుల రాజ్యం నడుస్తుంది. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తుంది. అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలి. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలి.

LEAVE A RESPONSE