Suryaa.co.in

Andhra Pradesh

జగన్ నడుపుతున్నది ప్రభుత్వమా…ప్రైవేటు సైన్యమా?!

యలమంచిలి:  యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర యలమంచిలి పట్టణంలో హోరెత్తింది. 222వరోజు యువగళం పాదయాత్ర కొత్తూరు ఎస్ వి కన్వెన్షన్ వద్ద క్యాంప్ సైట్ నుంచి కోలాహలంగా ప్రారంభమైంది. యువగళం రాకతో యలమంచి పట్టణంలో ప్రధాన రహదారి కిటకిటలాడింది. రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరారు. డప్పుశబ్ధాలు, గరగలు, బాణాసంచా మోతలతో యలమంచిలి దద్దరిల్లింది. మహిళలు అడుగడుగునా యువనేతకు నీరాజనాలు పడుతూ సంఘీభావం తెలిపారు. పన్నులపోటు, పెరిగిన ధరలతో బతుకుబండి లాగలేకపోతున్నామని మహిళల ఆవేదన చెందారు.

మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం పన్నులతోపాటు ధరలను అదుపుచేసి ఉపశమనం కలిగిస్తామని భరోసా ఇచ్చారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో యలమంచిలి రామాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, గవరలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.

యలమంచిలి శివార్లలో అంగన్ వాడీ వర్కర్లు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించగా, వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు, రైతులు యువనేతను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. యలమంచిలి శివార్లలో ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను యువనేత లోకేష్ పరిశీలించారు.

పంట నష్టం వివరాలను యలమంచిలి ఇన్ చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్ చార్జి సుందరపు విజయకుమార్ యువనేతకు తెలియజేశారు. 222వరోజు యువనేత లోకేష్ 14.4 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 3074 కి.మీ.ల మేర పూర్తయింది. యువగళంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం వెదురువాడలో నావల్ బేస్ బాధిత మత్స్యకారులు, కొప్పలవెలమలతో ముఖాముఖి సమావేశమవుతారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక 1వతేదీనే పెన్షన్
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తేదీన పెన్షన్ ఎకౌంట్లలో జమచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. యలమంచిలి రామాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చే దిక్కు లేదు, ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. టిడిపి హయాంలో 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే జగన్ రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులను ముంచేశాడు. జగన్ పాలనలో మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగులే, ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగస్తులను రోడ్డున పడేసాడు, విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని యువనేత లోకేష్ పేర్కొన్నారు. 2014 లో 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఉద్యోగస్తులకు చంద్రబాబు ఎటువంటి లోటు లేకుండా చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగస్తులు తప్పు చేస్తున్నారు అనే ముద్ర వేస్తున్నారు.

మెరుగైన ఫిట్ మెంట్ ఇస్తాం
జగన్ పాలనలో రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్ల కు చేరింది. ఏడాదికి లక్ష కోట్లు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది. రాబోయే 25 ఏళ్ల మద్యం ఆదాయం చూపించి పై అప్పు తెచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పీఆర్సీ వేసి మెరుగైన ఫిట్మెంట్ ఇస్తాం. జిఓ 79 తెచ్చి పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్స్ కూడా రద్దు చేసాడు. టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 79 రద్దు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల కోసం మెరుగైన హౌసింగ్ స్కీం తీసుకొస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు నాణ్యమైన ఇళ్లు కట్టిస్తాం. జగన్ ఆరోగ్య శ్రీ  కార్యక్రమాన్ని అనారోగ్య శ్రీ గా మార్చేశాడు.

అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అమలుచేస్తాం
అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల కు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందిస్తాం. మెరుగైన హెల్త్ స్కీం తీసుకొస్తాం. జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించక ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం చెయ్యమని చెబుతున్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెడికల్ బిల్లు లు  రీయింబర్స్మెంట్ చేస్తాం. రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశాల కోసం భవనాలు ఏర్పాటు చేస్తాం. గతంలో టిడిపి హయాంలో ఇచ్చిన మాదిరిగా అడిషనల్ క్వాంటం పెన్షన్ అమలు చేస్తాం. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలు అవుతున్న మంచి హెల్త్ స్కీం లు స్టడీ చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెరుగైన హెల్త్ స్కీం తీసుకొస్తాం. హక్కుల కోసం పోరాడాలి అన్నా భయపడే పరిస్థితి జగన్ పాలన లో ఉంది. జగన్ ఉద్యోగస్తులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకుంటాం.

రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ… జగన్ పాలన లో డిఏ, డిఆర్ లు రాక ఇబ్బంది పడుతున్నాం.  వైసిపి పాలనలో పెన్షన్ ఒకటో తారీఖున ఇవ్వడం లేదు. పెన్షన్ సమయానికి రాక ఈఎంఐ లు కట్టుకొలేని పరిస్థితి వచ్చింది. జగన్ ప్రభుత్వం రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చింది. మమ్మలని ముంచింది. ఉద్యోగస్తుల హెల్త్ స్కీం ఎక్కడా అమలు కావడం లేదు. మెడికల్ బిల్స్ రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు అంటున్నాయి. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదు. గ్రాట్యుటీ కూడా జగన్ ప్రభుత్వం ఎవరికి ఇవ్వడం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశాల కోసం స్థలం కేటాయించి భవనాలు ఏర్పాటు చెయ్యాలి. టిడిపి హయాంలో ఇచ్చిన అడిషనల్ క్వాంటం పెన్షన్ కూడా జగన్ ప్రభుత్వం తగ్గించింది. జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తుంది. జగన్ ప్రభుత్వ ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను హింసిస్తున్నాడు.

గవరలను వేధిస్తున్న జగన్ ప్రభుత్వం
బెల్లం వ్యాపారం చేసే గవరలను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది, అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది, జగన్ ప్రభుత్వం గవర సామాజికవర్గానికి చిల్లి గవ్వ ఇవ్వలేదు, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గవర కార్పొరేషన్ బలోపేతం చేస్తాం, గవరలకి పూర్వ వైభవం తీసుకొస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. యలమంచిలి రామాలయం వద్ద గవర సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గవర కార్పొరేషన్ బలోపేతం చేస్తాం. టిడిపి హయాంలో గవర సామాజికవర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం గవర కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది. టిడిపి బీసీలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది. గవర లకు అనేక ఉన్నతమైన పదవులు ఇచ్చింది టిడిపి. గవర అనగానే నాకు గుర్తొచ్చేది గౌరవం. కష్టపడే తత్వం ఉన్న వారు గవర సోదరులు. వ్యవసాయం, బెల్లం వ్యాపారం పై ఆధారపడిన వారు గవరలు. జగన్ పాలనలో 26 వేల మంది బిసిల పై అక్రమ కేసులు పెట్టారు. అమర్నాథ్ గౌడ్ ని అత్యంత కిరాతకంగా హత్య చేసారు వైసిపి నాయకులు. బీసీలను హత్య చేసిన వాడు బెయిల్ పై బయటకి వస్తే వైసిపి వాళ్లు సన్మానం చేసి ఊరేగిస్తున్నారు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.

వ్యవసాయ సబ్సిడీలను ఎత్తేసిన జగన్
టిడిపి హయాంలో వ్యవసాయానికి అనేక సబ్సిడీలు అందించాం. సబ్సిడీలో యంత్రాలు అందించాం.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు ఎత్తేసింది. విత్తనాలు, ఎరువులు, పరికరాల రేటు విపరీతంగా పెరిగిపోయాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో మాదిరిగా వ్యవసాయానికి సాయం అందిస్తాం. నల్ల బెల్లం పై నిషేదం ఎత్తేసింది టిడిపి. ఇప్పుడు నల్ల బెల్లం రైతులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది.

నిరుద్యోగులను జగన్ మోసగించాడు
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం అని మోసం చేసాడు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గవర సోదరులను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. బీసీ ల పై చెయ్యి వేసిన వారికి తగిన శిక్ష పడేలా నేను చూస్తాను.  జగన్ ప్రభుత్వం ఆపేసిన విదేశీ విద్య, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను తిరిగి ప్రారంభిస్తాం.అవసరమైన మేర ఐటిఐ లు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ అందిస్తాం.

గవర సామాజికవర్గీయులు మాట్లాడుతూ… గవర అనే కులం ఉందా అంటూ జగన్ ప్రభుత్వం మమ్మలని అవమానిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గవరలను వేధిస్తున్నాడు. గవర ఉద్యోగులను సస్పెండ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. గవర కులస్తులకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలి. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న మమ్మలని జగన్ ప్రభుత్వం చావు దెబ్బ కొట్టింది. గతంలో టిడిపి హయాంలో సాగుకు మాకు సాయం అందేది. ఇప్పుడు ఎటువంటి సాయం, సబ్సిడీ లు అందడం లేదు. గవర కార్పొరేషన్ ను జగన్ నిర్వీర్యం చేసాడు. జగన్ పాలనలో గవర నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. యలమంచిలిలో గవర సోదరులను వేధిస్తున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన అడిగినందుకు శంకర్ అనే గవర విద్యార్థి ని వైసిపి ఎమ్మెల్యే చెంప పై కొట్టాడు.  గవర సామాజిక వర్గం యువత స్వయం ఉపాధి కి జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందడం లేదు.  ఐటిఐ లు ఉన్నా గవర యువత కు అవకాశాలు రావడం లేదు. ఐటిఐలు పెంచాలని కోరారు.

అంగన్ వాడీ సెంటర్లను బద్దలు గొట్టే అధికారం ఎవరిచ్చారు?
తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మెకు దిగిన అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు యువనేత లోకేష్ సంఘీభావం తెలిపారు. యలమంచిలి శివార్లలో యువగళం పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలు యువనేత లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్ల ప్రతినిధులు లోకేష్ తో మాట్లాడుతూ… ప్రభుత్వంపై తమ పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని ఆవేదన చెందారు. డిమాండ్ల పరిష్కారంకోసం తాము సమ్మె చేస్తుంటే, వాలంటీర్లతో అంగన్ వాడీ సెంటర్ల తలుపులు బద్దలగొట్టి స్వాధీనం చేసుకున్నరన్నారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పారు. అంగన్ వాడీలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని లోకేష్ కు అందజేశారు. అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలి. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి..వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి..మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలి..ప్రీస్కూల్ ను బలోపేతం చేయాలి. హెల్పర్ ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించాలి. సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా ఇవ్వాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేవరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ, ఇతర బకాయిలు విడుదల చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, ప్రైవేటు సైన్యాన్ని నడుపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను పనికట్టుకుని వేధించడం దారుణం. అంగన్ వాడీ సెంటర్ల తాళాలు బద్ధలు గొట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? టిడిపి-జనసేన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తాం. అంగన్వాడీ యూనియన్లతో చర్చించి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజా ప్రభుత్వంలో అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితులు రాకుండా చూస్తాం. అంగన్వాడీలు చేస్తున్న న్యాయబద్దమైన పోరాటానికి తెలుగుదేశంపార్టీ సంపూర్ణ మద్దతు నిస్తుంది.

నారా లోకేష్ ను కలిసిన యలమంచిలి లైన్ కొత్తూరు ప్రజలు
యలమంచిలి నియోజకవర్గం లైవ్ కొత్తూరు నియోజకవర్గ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2014లో వచ్చిన తుఫానుకు 60ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితులకు గత ప్రభుత్వం త్వరితగతిన ఇళ్లు కట్టించి ఆదుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇళ్లకు రోడ్డు, కరెంటు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. పూర్వం నుండి రైతులు అనుభవిస్తున్న భూములకు సరైన రికార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పంటల బీమా, గిట్టుబాటు ధరలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మా పంచాయతీలో వీధి కుళాయిలలో వారానికి ఒకరోజే మంచినీరు వస్తోంది. పాడిరైతులకు గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు నేడు రావడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.

లోకేష్ స్పందిస్తూ…. జగన్మోహన్ రెడ్డికి పేదలంటే గిట్టదు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టి, నా మైనారిటీ అంటున్నాడు. తుఫానులతో నష్టపోయిన కుటుంబాలకు రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం దుర్మార్గం. మేం అధికారంలోకి వచ్చాక రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. 24/7 మంచినీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పాడిరైతులకు గతంలో అమలు చేసిన ప్రోత్సాహకాలు అందిస్తాం.

లోకేష్ ను కలిసిన కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు
యలమంచిలి వై జంక్షన్ వద్ద శివారు గ్రామాలు కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక మా మున్సిపాలిటీలో వీధిలైట్లు వేసే దిక్కులేదు. మంచినీరు, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. టీడీపీ పాలనలో రూ.120కోట్లు మంజూరు చేసినా వైసీపీ వచ్చాక వాటిని ఖర్చు పెట్టలేదు. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండి మురుగునీరు పంటకాలువల ద్వారా పొలాల్లోకి వస్తున్నాయి. ప్రభుత్వ కళాశాల నిమిత్తం టీడీపీ పాలనలో రూ.80లక్షలు, రూ.1.20కోట్లు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదు. రోడ్ల నిమిత్తం టీడీపీ పాలనలో రూ.100కోట్లు మంజూరు చేస్తే వైసీపీ వచ్చాక వాటిని రద్దు చేసింది.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దొంగిలించిన దొంగ ప్రభుత్వమిది. వైసిపి ప్రభుత్వం నిర్వాకం కారణంగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బ్లీచింగ్ చల్లడానికి చిల్లిగవ్వ లేకుండా చేశారు. మౌలిక వసతుల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం. తాగునీరు, రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. గత పాలనలో ప్రారంభించిన అభివృద్ధి పనులు, కళాశాలల పనులను పూర్తిచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన యలమంచిలి పట్టణ ప్రజలు
యలమంచిలి కోర్టు రోడ్డులో పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 8 శివారు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం యలమంచిలి మున్సిపాలిటీలో విలీనం చేసింది. దీంతో మాకు ఉపాధిహామీ పథకం అమలుకాక ఇబ్బందిపడుతున్నాం. యానాద్రి కాలువ వచ్చినప్పుడల్లా మా ప్రాంతం ముంపుకు గురవుతోంది. రైల్వే గేటు ఎక్కువసేపు మూసేయడం, ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తికాకపోవడంతో ఇబ్బందిపడుతున్నాం. రోడ్లు, మౌలిక సదుపాయాలు సరిగా లేవు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మంచినీటి కొరత అధికంగా ఉంది. టిడ్కో ఇళ్లకు గత పాలనలో ఉన్న లబ్ధిదారుల పేర్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక  మా సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ ప్రభుత్వానికి పన్నులపేరుతో ప్రజలను అడ్డగోలుగా దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ స్థానిక సంస్థల అభివృద్ధిపై లేదు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులనుకూడా వాడుకోలేని దద్దమ్మ సీఎం జగన్. తమను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లివ్వలేని అసమర్థుడు జగన్. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి పట్టణాలు, పల్లెల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తాం. పట్టణాల్లో విలీనం అయిన గ్రామాలకు ఉపాధి పథకం అమలయ్యేలా కేంద్రంతో మాట్లాడతాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసి గతంలో లబ్ధిదారులకే ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటాం. యలమంచిలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తిచేసి పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తాం. విద్యార్థుల సంఖ్యను బట్టి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కొక్కిరాపల్లి గ్రామస్తులు
యలమంచిలి మున్సిపాలిటీ శివారు గ్రామం కొక్కిరాపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతంలోని 5 గ్రామాలను మున్సిపాలిటలో 2 వార్డులుగా మార్చారు. మా ప్రాంతంలోని ప్రజలు ఎన్.హెచ్-16 రోడ్డు దాటడానికి ఇబ్బందిపడుతున్నారు. ట్రాఫిక్ సమస్య వల్ల 3 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సివస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో స్థానిక ప్రజలు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. మా గ్రామం నుండి రెల్లికాలనీ, యాదవ కాలనీ వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదు. కొక్కిరపల్లి రైల్వే గేటు కాలనీ ప్రజలు 25ఏళ్లుగా అక్కడ ఉంటున్నారు. వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇప్పించాలని స్థానికి ఎమ్మెల్యేని అడిగితే ఇవ్వకపోగా బెదిరించారు. ఇళ్లపట్టాలిచ్చి ఇల్లు లేని ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కొక్కిరపల్లి రైల్వే గేట్ పైవంతెన పనులు త్వరగా పూర్తిచేసి ట్రాఫిక్ కష్టాలు తొలగించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అవగాహన లేమితో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడు. పంచాయతీలను మున్సిపాలిటీల్లో కలిపి ప్రజలను వేధిస్తున్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్యలేవీ పట్టించుకోవడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక కొక్కిరాపల్లి గ్రామ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తాం. రోడ్లు లేని ప్రాంతంలో కొత్త రోడ్లు వేస్తాం..ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తాం. రైల్వేగేటు కాలనీ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. కొక్కిరపల్లి రైల్వే గేట్ పైవంతెన పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం.

లోకేష్ ను కలిసిన కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు
యలమంచిలి కొత్తపాలెం జంక్షన్ లో కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం నీరు-చెట్టు పథకం ద్వారా పంటకాలువలు, చెరువుల పూడిక తీయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పూడికలు తీయడం లేదు. రైతులకు గతంలో ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేవారు. జగన్ పాలనలో ఇవేమీ ఇవ్వడం లేదు. పంటపొలాలకు సకాలంలో నీరు రాకపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోతోంది. శారద నది గేట్లు సరికా నిర్వహించక తుప్పు పట్టి పాడైపోయి నీరు మా గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.నీటినిల్వ చేసే పరిస్థితి కూడా వైసీపీ పాలనలో కనబడడం లేదు.ఈక్రాప్ బుకింద్ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. శారద నది గేట్లు సరిగా నిర్వహించలేని దౌర్భగ్యపు ప్రభుత్వం అధికారంలో ఉండటం విచారకరం. గేట్లకు గ్రీజు పెట్టలేని దుస్తితి కారణంగా పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. రైతులు పంటలకు గిట్టుబాటు ధర రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటకాలువలు, చెరువులు పూడిక తీయకుండా రైతులను నట్టేట ముంచుతున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక కాలువలు, చెరువులు పూడిక తీయిస్తాం. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు సబ్సిడీపై అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన రైతులు
యలమంచిలి కట్లుపాలెం జంక్షన్ వద్ద రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 200 సంవత్సరాల క్రితం ఏడుముళ్ల డ్యామ్ ను బ్రిటీషు వారు నిర్మించారు. ఈ డ్యాముపై ఆధారపడి 14గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్నాం. 20 ఏళ్ల క్రితం తుఫాను వల్ల డ్యామ్ దెబ్బతినడం వల్ల రైతులు నీరు లేక ఇబ్బంది పడ్డారు. హుద్ హుద్ తుఫాను, ఆ తర్వాత వచ్చిన తుఫానుల వల్ల డ్యామ్ నేలమట్టమై నీరు సముద్రంలోకి వెళుతోంది. పంట పొలాలకు నీరు లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏడుముళ్ల డ్యామ్ ను పునః నిర్మాణం చేసి ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… నీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. జగన్ దివాలాకోరు ప్రభుత్వం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు నిర్లక్ష్యానికి కొట్టుకుపోయింది. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి నెలకొంది. రైతు ఆత్మహత్యల్లో ఎపి 3వస్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వస్థానంలో నిలిపారు. మేం అధికారంలోకి వచ్చాక పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. ఏడుముళ్ల డ్యామ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన రాంబిల్లి మండల రైతులు
యలమంచిలి నియోజకవర్గం నారాయణపురం వద్ద రాంబిల్లి మండల రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మిచౌంగ్ తుఫాను వల్ల మేము తీవ్రంగా నష్టపోయాం. నారాయణపురం, తెరువుపల్లి, దిమిలి, కట్టుబోలు, మురకాడ, కుమ్మరాపల్లి, జాల, మర్రిపాలెం గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదు. ఎకరానికి రూ.30వేలు నష్టపరిహారం అందించాలి. యాంత్రీకరణ రావడం వల్ల కూలీలకు పనులు దొరకడం లేదు. వరి పంటకు క్వింటాల్ కు రూ.3వేలు ఆర్థికసాయం అందించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… పంటల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పిన జగన్ రైతులను నట్టేట ముంచాడు. గత ఏడాది ప్రభుత్వం పంటల బీమా చెల్లించింది కేవలం 16మంది రైతులకు మాత్రమేనని ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంది. వైసీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో రైతులకు నష్టాలు తప్ప లాభాలు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చాక పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తాం. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానించేందుకు కేంద్రంతో మాట్లాడతాం.

నారా లోకేష్ ను కలిసిన రజాల గ్రామస్తులు
యలమంచిలి నియోజకవర్గం రజాల గ్రామ రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో శారద నదిపై ఆనకట్టు ఉంది. 2019లో ఈ ఆనకట్ట వరదలకు కొట్టుకుపోయింది. ఈ ఆనకట్టపై ఆధారపడి 9వేల ఎకరాల పంట భూములున్నాయి. ఆనకట్ట తెగి నీరు లేక రైతులు నీరు లేక ఇబ్బందిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆనకట్టను పునరుద్ధరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పాలన రైతులకు శాపంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లింది. సాగునీటి ప్రాజెక్టులు, గేట్లు నిర్వహణ లోపం వల్ల కొట్టుకుపోతున్నాయి. మేం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు శారద నదిపై ఆనకట్టను పునరుద్ధరిస్తాం. ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెడతాం.

నారా లోకేష్ ను కలిసిన పంచదార్ల గ్రామస్తులు
యలమంచిలి నియోజకవర్గం పంచదార్ల గ్రామస్తులు యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 200మందికి ఇళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 30మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయలేదు. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని పనులకు శంకుస్థాపన చేసి పనులు నిలిపేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటోంది. సెంటు పట్టా పేరుతో జగన్ అండ్ కో రూ.7వేల కోట్లు దోచుకున్నారు. జగనన్న కాలనీల్లో స్థలాలు వైసీపీ నాయకులు సొంత పార్టీ వాళ్లకే ఇచ్చారు. ఆవాసయోగ్యం కాని స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘం నుండి వచ్చిన రూ.9వేలకోట్లు జగన్ దారిమళ్లించాడు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను జగన్ నిర్లక్ష్యం చేశాడు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు అదనపు నిధులిచ్చి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం. ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలతో పాటు పక్కాఇళ్లు మంజూరు చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం.

LEAVE A RESPONSE