గవర్నర్ బిల్లులను పెండింగ్ లో పెట్టడం దారుణం

మంత్రి హరీష్ రావు

కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతి పత్తి కలిగిన సంస్థలను కూడా వాడుకుంటుంది.గవర్నర్ గారు బిల్లులను పెండింగ్ లో పెట్టడం దారుణం. కోర్టులో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ కానీ పరిస్థితి తెలంగాణలో ఉంది.మంత్రులు కలిసినా గవర్నర్ బిల్లులను ఆమోదించట్లేదు.రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి సుప్రీం కోర్టు మెట్లు ఎక్కితే కానీ బిల్లులు పాస్ కానీ పరిస్థితి.

అన్ని వ్యవస్థలను బిజెపి ఆధీనంలో పెట్టుకుంటుంది.ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టుకుంటే క్యాబినెట్ ఆమోదించింది.గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి దగ్గర పంపారు.ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే.పిల్లల భవిష్యత్ తో బిజెపి చేలగాటం ఆడుతుంది.ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే.. గిన్నీ నోటిఫికేషన్ల అంటారు.

పేపర్లు లీక్ చేసి విద్యార్థుల బావిష్యత్తును ఆగం చేసిర్రు.పిల్లలు భవిష్యత్ కంటే మీకు రాజకీయాలు ముఖ్యం.గవర్నర్ గారు ఇది కరెక్టేనా అని అడుగుతున్న.ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ వస్తే మీకు ఇబ్బంది ఏంటి?రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.వెనుక నుంచి బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలి.

Leave a Reply