Suryaa.co.in

Andhra Pradesh

దేశాన్ని కాపాడగలిగేది రాహుల్ గాంధీ నాయకత్వమే

– సంస్థాగత నిర్మాణంతో ఇందిరమ్మ రాజ్యం సాధ్యం
– పార్టీని కష్ట కాలంలో నడిపిన వారికి కృతజ్ఞతలు
– బోగస్ సభ్యత్వాలు వద్దు… ఇంటింటికీ తిరగండి
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు తోనే మనం అనుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించగలమని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశాన్ని కాపాడ గలిగేది రాహుల్ గాంధీ నాయకత్వమే నని, ఆయన ఆలోచనలే ముందుకు తీసుకు పోతాయని పునరుద్ఘాటించారు. బాధ్యత కలిగిన కార్యకర్తలుగా ముందుకు సాగాలని, క్లిష్టమైన…కష్ట కాలంలో పార్టీని ముందుకు నడిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు చేయాలని, బోగస్ సభ్యత్వాలు వద్దు అని హితవు పలికారు. ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE