Suryaa.co.in

Entertainment Telangana

దిల్‌రాజు ఇంటిపై ఐటి దాడి

– మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలల్లోనూ తనిఖీలు
– దిల్ రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీలోనూ సోదాలు
– సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఆఫీసు, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇళ్లలోనూ సోదాలు

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో పన్నెండు గంటలుగా ఐటీ సోదాలు సోదాలు నిర్వహించింది. దిల్ రాజు, ఆయన తమ్ముడు శిరీష్, కూతురు హన్సితతో పాటు పలువురు బంధువులు, భాగస్వాముల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. దిల్ రాజు భార్య తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్‌ను తెరిపించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాల పెట్టుబడి, కలెక్షన్లను ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలకు చెందిన నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలల్లోనూ అధికారులు తనిఖీలు జరిపారు. 55 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు ప్రారంభించారు. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్, ఐటీ రిటర్న్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన దిల్ రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీలోనూ సోదాలు నిర్వహించారు.

కొన్ని సినిమా ఫైనాన్స్ సంస్థల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులో సోదాలు చేశారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్‌లలోని పలువురు బడా నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.

LEAVE A RESPONSE