Suryaa.co.in

Telangana

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోని అజెండా 5లోని అంశాలు దాచి పెట్టారు

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం

హైదరాబాద్‌: బోడిగుండుకు మోకాలుకు లంకె పెట్టి మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సిద్దహస్తుడు అని మరోసారి రుజువైంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ చెప్పిన వాటిని దురుద్దేశపూర్వకంగా వక్రీకరించాడు.

రాజకీయ లబ్ది పొందాలనే వక్ర బుద్దే తప్ప, తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలనే తపన లేదు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోని అజెండా 5లోని అంశాలు దాచి పెట్టి, అజెండా నం.1 అంశాలను మాత్రమే ప్రస్తావించాడు.

” గోదావరి–కృష్ణ నదుల అనుసంధానం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదు.” అని కేసీఆర్ అజెండా 5లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కావాలని దాచిపెట్టి, స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాల కోసం అసత్యాలను ప్రజల ముందు ఉంచారు. మీడియాను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అబద్దాల పునాదుల మీద జరిగిన ఈనాటి రేవంత్ తతంగాన్ని ప్రజలు విశ్వసించరు.

LEAVE A RESPONSE