-బలిజ నాడు కన్వీనర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ ఓవి రమణ
తిరుపతి, సూర్య : వైఎస్సార్ స్వభావం, పాలన జగన్ కు ఒక్క శాతం కూడా రాలేదని బలిజ నాడు కన్వీనర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ ఓవి రమణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఇంకా అధికారిక పరంగా స్థిరపడలేదు. ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వవలసిన అవసరం వుంది. మాజీ సీఎం జగన్ ఈ 45 రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు. రాజశేఖరరెడ్డి స్వభావం, పాలన ఒక్క శాతం కూడా జగన్ సంపాదించలేకపోయాడు. పోలవరంపై చంద్రబాబుకు క్లాసులు చెబుతామన్న జగన్ రేపు అసెంబ్లీలో క్లాసుకు సిద్దమా ? అని ప్రశ్నించారు.
ఢిల్లీలో నిరసన తెలుపుతామన్న స్టేట్మెంట్ హాస్యాస్పదం అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టే ధైర్యం చేయకపోగా ఢిల్లీ వెళ్తాను అంటే ఎలా తీసుకోవాలి. రాష్ట్రపతి పాలన కావాలి అని డిమాండ్ చేయడం వెనుక ఆయన అవగాహన లోపం కనిపిస్తుంది. వైసీపీ లీడర్స్ వారి పార్టీ నుంచి జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు వలన టీడీపీ శ్రేణుల వలన వైసీపీ వారికి ఎలాంటి హానీ ఉండదన్నారు. వైసీపీ వారిని చంపి టీడీపీ అకౌంట్లో వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
సొంత చెల్లిని తన నాన్నకు పుట్టలేదన్న జగన్ ఎలాంటి వారో అర్థం చేసుకోవాలన్నారు. స్వతహాగా జగన్ ఓ ఆర్థిక నేరస్థుడు అలాంటివాని నైజం ఎలా ఉంటుందో అలోచించండన్నారు. ప్రజలు ఇంతటి వైఫల్యాన్ని కట్టబెట్టినా మళ్ళీ మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో దేశం ఏపీ వైపు చూసేలా కబ్జాలు, దోపిడీలు, దాడులు, గంజాయితో రాజ్యాన్ని పరిపాలించారన్నారు.
తన సౌకర్యాల కోసం రుషికొండలో ప్రజాధనంతో ప్యాలెస్ నిర్మించారు. నేడు విజయసాయి రెడ్డి ని చూస్తుంటే యూటూ బ్రూటోస్ మాట గుర్తొస్తుంది. జగన్ కు పక్కన నిలబడ్డ రాజద్రోహి సాయి రెడ్డి. వ్యక్తిగత ఆరోపణలను అవాస్తవం అని తెలపడానికి శ్రీవారిపై ఒట్టు పెట్టడం హేయమైన చర్య అన్నారు. స్వామివారి పింక్ డైమండ్ పై అసత్య ఆరోపణలు చేసి టీటీడీతో 2 కోట్లు డిఫర్మేషన్ ఫీ కట్టించన సొమ్మును రికవరీ చేయాలి అని డిమాండ్ చేశారు. ఇటువంటి నీచులు జగన్ పక్కన చేరడం వలన అతని భవిష్యత్తు భ్రస్టు పట్టిపోయిందని ఎద్దేవా చేశారు.