Suryaa.co.in

Andhra Pradesh

అవినీతి ఎన్నిరకాలుగా చేయొచ్చో జగన్‌ చూపించారు

-న్యాయవ్యవస్థను నాశనం చేసింది రమణ, వెంకయ్యే
-రాజకీయాలను డబ్బుతో నడిపింది చంద్రబాబే
-డీజీపీని మార్చకుంటే రాష్ట్రం వల్లకాడు అయ్యేది
-గుజరాత్‌ పోర్టు నుంచే గంజాయి, డ్రగ్స్‌ సరఫరా
-తెలుగు ప్రజలకు ప్రధాన శత్రువు మోదీనే
-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవ స్థను, తెలుగు ప్రజలను నాశనం చేసింది మాజీ సీజే వెంకటరమణ, వెంకయ్య నాయుడేనని వ్యాఖ్యానించారు. అవినీతిని ఎన్నిరకాలుగా చేయవచ్చో జగన్‌మో హన్‌రెడ్డి వద్ద నేర్చుకోవచ్చని, చంద్రబాబు బతుకుతెరువు రాజకీయాల కోసమే మోదీతో కలిశారని పేర్కొన్నారు. 97 శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నా యని, మొట్టమొదటగా రాజకీయాలను డబ్బుతో నడిపించింది చంద్రబాబు నాయుడేనని అన్నారు. గుజరాత్‌లోని ముందనార్‌ పోర్టు నుంచి గంజాయి, డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని చెప్పిన నారాయణ ఎన్నికలకు ముందు డీజీపీని మార్చకపోతే రాష్ట్రం వల్లకాడు అయ్యేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరిగాయని, ఓటమి తప్పదని వైసీపీ వారు దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది..
ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు కన్నయ్యపై దాడులు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందని, 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్‌ గేమ్‌ ఆడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని, ఏపీలో ప్రభుత్వం మారబోతుందని చెప్పారు. ప్రస్తుతం ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని, తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోదీనే అని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE