Suryaa.co.in

Political News

వైసీపీ గబ్బు పార్టీయేనట!

– వెంకన్న సాక్షిగా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి మనసులో మాట
– అల్లుడు జగన్ పక్కలో బాంబు పేల్చిన మేనమామ రవీంద్రనాధ్‌రెడ్డి
– కౌంటింగ్ ఏజెంట్ల ఆత్మస్ధైర్యం దెబ్బతీశారని తలపట్టుకున్న వైసీపీ అభ్యర్ధులు
( అన్వేష్)

మనసులో గూడుకట్టుకున్న నిజాలు ఒక్కోసారి తెలియకుండానే బయటకు తన్నుకొచ్చేస్తుంటాయి. వైసీపీ అధినేత-సీఎం జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ అభ్యర్ధి రవీంద్రనాధ్‌రెడ్డి కూడా ఇలాగే తిరుమల వెంకన్న సమక్షంలో మనసులో మాట బయటపెట్టి, అల్లుడి పక్కలో బాంబు పేల్చారు. వైసీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బు పట్టించారని.. దేవుడి సమక్షంలోనే నిజం కక్కేశారు. ఇప్పుడిది రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

తిరుమల వెంకన్న దర్శననానికి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ‘రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ’ అని మనసులో మాట బయటపెట్టడం.. అది కాస్తా సోషల్‌మీడియాలో దుమ్మురేపటం జరుగుతోంది. ఇప్పుడిది సోషల్‌మీడియాలో యమా ట్రెండింగ్‌గా మారింది.

ఇప్పటికే వైసీపీ తరఫున ఎవరూ బెట్టింగులు కాయవద్దని, మొన్నటివరకూ జగనన్న సర్కారులో కొలువు వెలగబెట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు వారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజానికి వైసీపీ గెలుస్తుందని బెట్టింగులు కట్టేవాళ్లే లేకుండా పోయారని.. ఆ పార్టీ జల్సారాయుళ్లు తెగ బాధపడుతున్న సమయంలో, స్వయంగా జగన్ మేనమామ రవీంద్రనాధరెడ్డే.. వైసీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బుపట్టించిందని నిజం కక్కేస్తే.. ఇక కౌంటింగ్‌లో కూర్చునేందుకు ఏజెంట్లు ఎవరుదొరుతారబ్బా? అని ఆ పార్టీ అభ్యర్ధులు తలపట్టున్నారట.

LEAVE A RESPONSE