Suryaa.co.in

Andhra Pradesh

మత్స్యకారుల ద్రోహి జగన్ రెడ్డి

-చంద్రన్న మత్స్యకార భరోసాను ఇస్తే జగన్ రెడ్డి మత్స్యకారులకు టోకరా పెట్టారు
– కొండేపి శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయస్వామి

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్బంగా మత్స్యకార సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మత్స్యకారులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి ఉన్నప్పుడు వేట నిషేదిత సమయంలో 31 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం మొట్ట మొదటి సారిగా మత్స్యకార భరోసా కింద రూ.4వేలు ఇచ్చారు.

అర్హత ఉన్న ప్రతిఒక్కరికి అందించారు. కాని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటికో పథకం ఉండాలని మత్స్యకార భరోసా పథకాన్ని రద్దు చేశారు. మూడున్నరేళ్ల పాలనలో ఒక్క మత్స్యకారుడికి వల, బోటు ఇచ్చిన ధాఖలాలు ఉన్నాయా? వలలు తెగిపోయినా, బోటులు దెబ్బతిన్నా కనీసం మరమ్మత్తులకు ఒక్క రూపాయి ఇచ్చారా లేదో చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా?

టీడీపీ హయాంలో డ్యామేజీ బోట్ల స్థానంలో కొత్త బోట్లు, అదే విధంగా కొత్త వలలు ఇచ్చాం. చేపలకు డ్రైయింగ్ ప్లాట్ ఫాంలు ఇవ్వడం జరిగింది. 50ఏళ్లకే మత్స్యకారలకు పెన్సన్ ఇస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఆక్వారంగాన్ని కుదేలు చేశారు. ప్రకాశం జిల్లాలో మత్స్యకార దినోత్సవాన్ని తీర ప్రాంతాల్లో చేయకుండా సుదూరంగా ఉన్న ఎర్రగుండపాలెంలో చేయడం మత్స్యకారుల మీద ఉన్న ప్రేమ ను తెలియజేస్తుంది.

గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు విరిగిపోతే కోట్లాది రూపాయల మత్స్యసంపద నాశనం అయినా జగన్ రెడ్డి ఇంత వరకు వాళ్లను ఆదుకోలేదు. మత్స్యకారుల నివాశ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా వైసీపీ అన్యాయులు ఉన్న ప్రాంతాల్లో మెరుగుపరడం దుర్మార్గం.

LEAVE A RESPONSE