Suryaa.co.in

Andhra Pradesh

ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపిన జగన్ రెడ్డి పేదల ద్రోహి కాదా?

-తన అబద్దాలను ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం కాదా?
-విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నాశనం చేసిన జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర ద్రోహి కాదా?
-మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు

భీమిలిలో అబద్దాలతో ఆత్మస్తుతి పరనిందకు పాల్పడిన జగన్ రెడ్డి. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని, విద్యుత్ ఛార్జీలు పెంచనని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసతానని, వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని, అంగన్వాడీలకు తెలంగాణ కంటే రూ.1000 ఎక్కువ జీతమిస్తానని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తానని, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచనని, ప్రత్యేక హోదా సాధిస్తానని దాదాపు 730 హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక అందులో 85% హామీలపై మాట తప్పి మడమ తిప్పాడు. 99 శాతం హామీలు అమలు చేశానని సిగ్గులేకుండా అబద్దాలు చెబుతున్నాడు.

అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృది, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పండుగ కానుకలు, చంద్రన్న బీమా లాంటి దాదాపు 130 పథకాలు రద్దు చేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి గొంతు కోసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. వాహన మిత్ర పేరుతో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చి రెండో వైపు పెట్రోల్ డీజిల్ ధరల పెంచి, గ్రీన్ ట్యాక్స్, పోలీస్ జరిమానాలు పెంచి, మద్యం రేట్లు 3 రెట్లు పెంచి లక్ష కొట్టేస్తున్నది వాస్తవం. ఎడమ చేత్తో గోరంత ఇస్తూ కుడి చేత్తో కొండంత కొట్టేస్తున్నాడు. నవరత్నాలు నవమోసాలయ్యాయి.

రూ.2 లక్షల కోట్ల విలువైన నాశిరకమైన మద్యాన్ని అమ్మి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశారు. అందులో 30 వేల మంది ప్రాణాలు తీశారు. వారి ఇంట్లో మహిళల మాంగళ్యాలు మంటకలిపింది నిజం కాదా? 1200 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ వైద్యం పేదలకు దూరం చేయలేదా? ధరలు, ఛార్జీలు, పన్నులు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై 56 నెలల పాలనలో రూ.8 లక్షల చొప్పున భారం మోపింది నిజం కాదా? రూ.12 వేల కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించి గ్రామాల్ని నాశనం చేసింది నిజం కాదా? రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందంటే ఆ పాపం నీది కాదా? ఉపాధి కూలీల సొమ్ము కాజేసింది నీవు కాదా? కరెంటు కోతలు కోసింది నీవు కాదా?

ఫీజు రాయింబర్స్ మెంట్ చంద్రబాబు 16 లక్షల మందికి ఇస్తే దాన్ని 8 లక్షల మందికి కోత కోసింది నీవు కాదా? ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా విద్యా ప్రమాణాల్లో ఏపీని 3వ స్థానం నుండి 19వ స్థానానికి దిగజార్చింది నీవు కాదా? పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలోనే ఏపీలో అధిక రేట్లు ఉన్నది నిజం కాదా? అంగన్వాడీలకు చంద్రబాబు రూ.6,300 పెంచితే నీవు పెంచింది కేవలం రూ.1000 మాత్రమే కాదా? హామీ ప్రకారం తెలంగాణ వలే జీతాలు అడిగిన అంగన్వాడీ మహిళలలపై దాడులు చేసింది అందరూ చూడలేదా? మోసాలకు, అబద్దాలకు, దుర్మార్గాలక బ్రాండ్ అంబాసిడర్ నీవు కాదా జగన్ రెడ్డీ? నీవు బిడ్డవి కాదు క్యాన్సర్ గడ్డవి.

బాబాయి వివేకానందరెడ్డిని గొండల్లితో అత్యంత కిరాతకంగా నరికి చంపిన దుర్యోధన దుశ్వాసనులకు రక్షణ కల్పిస్తున్న జగన్ రెడ్డి పులివెందులలో కూడా ఓడిపోకతప్పదు. నీ అబద్దాల్ని ఎదుటివారికి అంటకట్టి చెప్పిన అబద్దాన్నే వందసార్లు చెబితే నమ్మే అమాయకులు కాదు ఆంధ్రా జనం.

LEAVE A RESPONSE