Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అక్రమ, అవినీతిని ఇక సహించేది లేదు

-ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, బేఖాతరు చేస్తున్న అధికారులపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు
-జగన్ రెడ్డి అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం
-అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులను ఉపేక్షించేది లేదు
– తెదెపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

మంగళవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, పోలీట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ పాల్గొన్నారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి ఎన్నో ఫిర్యాదులు చేశామని కానీ నేటికి వాటిపై చర్యలు లేవని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, బేఖాతరు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని వర్ల రామయ్య కోరారు.

“ప్రభుత్వ అధికారిగా ఉన్న సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్ రామిరెడ్డి బహిరంగంగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నాడు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కూడా అతను బేఖాతరు చేస్తున్నాడని ఎన్నికల కమిషనర్‌కు వివరించాం. విద్యార్ధులకు చదువు చెప్పడం మానేసి వారితో ఎన్నికల సర్వే చేయిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై కూడా ఈసీకి ఫిర్యాదు చేశాం.

ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ బాబు కారును 3 రోజుల్లో 4 సార్లు ఎన్నికల కోడ్ సాకుతో చెక్ చేశారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో లోకేష్ గెలవబోతున్నాడని తెలిసే సరికి కావాలని లోకేష్ బాబును టార్గెట్ చేశారు. లోకేష్ బాబు కారులో రూ.8 కోట్లు దొరికినట్లు సజ్జల భార్గవ్ రెడ్డి ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు. దాని మీద పోలీసులకు, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసి 3 రోజులు అవుతోంది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎన్నికల కమిషనర్ కు మరోసారి ఫిర్యాదు చేశాం.

గంగిరెడ్డి అనే పెద్దిరెడ్డి చెంచా…చిత్తూరులో ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నాడు. అతను చిత్తూరు రూరల్‌లో 3 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాడని చిత్తూరు జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే అతన్ని చిత్తూరు స్పెషల్ బ్రాంచ్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పుడు ఇన్‌స్పెక్టార్‌గా కేవలం ఒక్క సర్కిల్‌కు మత్రమే ప్రభావం చూపగలడు. నేడు వైసీపీని గెలిపించాలని చిత్తూరు జిల్లా మొత్తాన్ని చెలాయిస్తున్నాడు. అతన్ని ఆ విధుల నుంచి తప్పించాలని సీఈసీని కోరాం.

కారంపూడిలో టీ తాగుతున్న మా తెదెపా కార్యకర్తలను తూపాకీతో సర్కిల్ ఇన్‌స్పెక్టార్ చిన్న మల్లయ్య బెదిరించి, లాటీలతో వాళ్ళని కొట్టి, మాచర్లలో టీడీపీ ఉండటానికి వీలు లేదని బెదిరించాడు. ఎమ్మెల్యేకు చెంచాలా ఎస్సై వ్యవహారం ఉంది.

ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ వైసీపీ నాయకుడిలా విజయసాయిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిలతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఓ మసీదులో వైసీపీ ఎమ్మెల్సీ రహుల్లా బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధి వెల్లంపల్లిని గెలిపించండని మసీదులో ప్రచారాలు చేస్తున్నాడు. ఆధారాలతో సహా రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేస్తే..నేనేం చర్యలు తీసుకోలేనని చేతులెత్తేశాడు. కమిషనర్లు కేవలం చోద్యం చేస్తున్నారని సీఈసీకి తెలిపాం.

రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణాలు జరగకూడదని కోర్టు, ఎన్జీటీ, ఆదేశాలు ఇచ్చినా అధికార పార్టీ వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సహజ వనరులను దోచేస్తుంది. 3 రోజుల్లో ఆయా జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా జరగడం లేదని కలెక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వమని సీఈసీ చెప్తే ఒక్క కలెక్టర్‌ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సహజ వనరులను దోచేసి రేపు ఎన్నికల్లో ఆ డబ్బును వాడుకోవాలని వైసీపీ చూస్తోందని సీఈసీకి వివరిస్తే…రేపు కలెక్టర్లతో జరగబోయే వీడియో కాన్ఫరెన్సులో ఖచ్చితంగా తగిన ఆదేశాలు ఇస్తామని ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారు.

మేము ఇచ్చిన ఫిర్యాదులన్నిటి మీద ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వివరణ తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాత్రికేయ మిత్రులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను…ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. అక్రమ, అవినీతి మార్గంలో జగన్ రెడ్డి ఎలా అధికారంలోకి రావాలని చూస్తున్నాడో ప్రజలకు తెలియజేయండి. ఇక జగన్ రెడ్డి అవినీతిని సహించేది లేదు. జగన్ రెడ్డి అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని ఫిర్యాదులైనా చేస్తూనే ఉంటాం. ఎన్నికల ఎప్పుడూ వస్తాయా ఎప్పుడ రాక్షస పాలనకు స్వస్థి పలుకదామా, ఎప్పుడు అవినీతి పరిపాలకు అంతం పలుకుదామా అని ప్రజలు వేచి ఉన్నారు”అని తెలియజేశారు.

LEAVE A RESPONSE