ఉత్త‌ర‌కొరియా నియంత‌ కిమ్‌ని మించిపోయాడు జ‌గ‌న్

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఉత్త‌ర‌కొరియా నియంత‌ కిమ్‌ని మించిపోయాడు జ‌గ‌న్. పార్టీకి శాశ్వ‌త అధ్య‌క్షుడిగా త‌న‌కి తానే ప్ర‌క‌టించుకున్నాన‌ని, రాష్ట్రానికి శాశ్వ‌త ముఖ్య‌మంత్రిని అనుకుంటున్నారేమో! వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టుర‌ట్టు చేశార‌నే అక్క‌సుతో పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ సెక్యూరిటీ తొల‌గించేశారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌రెడ్డి ఆర్థిక ఉగ్ర‌వాదాన్ని గ‌ణాంకాలతో స‌హా వెల్ల‌డించిన కేశ‌వ్‌ త‌న‌కు అద‌న‌పు భ‌ద్ర‌త కావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరితే..ఉన్న సెక్యూరిటీ తొల‌గించేశారు. ఈ క‌క్ష‌సాధింపుల‌తో వైసీపీ స‌ర్కారు వేల‌కోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజ‌మేన‌ని ఒప్పుకున్న‌ట్టే. త‌క్ష‌ణ‌మే కేశ‌వ్‌ కి అద‌న‌పు గ‌న్‌మెన్ల‌ను కేటాయించి సెక్యూరిటీ పున‌రుద్ధ‌రించాలి.

Leave a Reply