ప్రజలు తిరగబడి మీ అంతు చూస్తే.. నాకు బాధ్యత లేదు… ఆ పై మీ ఇష్టం!

-రౌతుకొద్దీ గుర్రం. అందుకే పోలీసులు ఇలా అయ్యారు
-రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక శని గ్రహంలా మారాడు
-జగన్ రెడ్డి ఊరికో సైకోను సిద్దం చేశాడు
-జగన్ ఎక్కడ చదువుకున్నాడు.?
-నేనేమీ సినిమా యాక్టర్ కాదు.. కానీ కట్టలు తెంచుకుని జనం ఇక్కడికి వచ్చారు
-ఆదోనిలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో

అన్నీ ఆపేశాడు….అభివృద్ది నిలిపివేశాడు. పెళ్లి సంబంధం చూడాలి అంటే అన్నీ చూస్తాం….కానీ నాడు ముద్దలకు మోసపోయి ఓట్లు వేసి నష్టపోయాం.తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారు.మూడున్నరేళ్లలో అభివృద్ది ఆగిపోయింది…..రౌడీయిజం పెరిగిపోయింది…దోపిడీ, నేరాలు పెరిగిపోయాయి.

రాయదుర్గం నియోజకవర్గంలో ఓ కుటుంబ వివాదాన్ని కానిస్టేబుల్ బెదిరించారు. దీంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చనిపోయారు. ఎందుకు పోలీసు వ్యవస్థ ఇలా అయ్యింది.? రౌతుకొద్దీadoni గుర్రం. అందుకే పోలీసులు ఇలా అయ్యారు.జగన్ రెడ్డి ఊరికో సైకోను సిద్దం చేశాడు. వాళ్లు నన్ను ఏమీ చెయ్యలేరు. మా క్యాడర్ తిరగబడితే ఏమి చేస్తారు…పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. పోలీసులకు జీతాలు రావడం లేదు….మీ పిల్లలూ నష్టపోయారు.

నేనేమీ సినిమా యాక్టర్ కాదు…నా సినిమా సూపర్ హిట్ కాలేదు. కానీ కట్టలు తెంచుకుని జనం ఇక్కడికి వచ్చారు. మళ్లీ టిడిపి రావాలి అని సంఘీభావం తెలిపేందుకు మీరంతా వచ్చారు.నా కర్నూలు పర్యటనలో వైసీపీ చోటానేతలు వేషాలు వేస్తే…పోలీసులు చూస్తూకూర్చున్నారు. ప్రజలు తిరగబడి మీ అంతు చూస్తే నాకు బాధ్యత లేదు.ఆపై మీ ఇష్టం.

రాష్ట్రంలో అన్ని వర్గాలపైనా వైసిపి ప్రభుత్వం బాదుడే బాదుడు.చెత్తమీద పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రిని ఏమనాలి? మనం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపైనా పన్ను వేస్తోంది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇసుక దొరుకుతాఉందా….ఈ ఊళ్లో ఇసుక కర్నాటక, హైదరాబాద్లో దొరుకుతుంది.ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా…ఏం చేస్తున్నారు. సాయంత్రానికి డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు.

బంగారం స్మగ్లింగ్ పై ఒకరు వార్తను ఫార్వర్డ్ చేస్తు సిఐడితో అరెస్టు చేశారు. మద్యం మాఫియాతో జగన్ దోపిడీ చేస్తున్నారు. తయారీ ఆయనే…అమ్మకం ఆయనే. ప్రకాశం జిల్లాలో హవాలా మంత్రి….కర్నూలులోadoni2 బెంజి మంత్రి. ఇదీ జగన్ క్యాబినెట్. ఇసుక సొమ్ము, మద్యం సొమ్ము చాలడం లేదు. నకిలీ విత్తనాలతో పత్తిరైతులను ముంచారు.నాడు తప్పు చేస్తే తాట తీస్తాను అని భయం ఉంది కాబట్టి అక్రమాలకు అంతా భయపడ్డారు. కానీ నేడు ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు.

వైసీపీ నేతలు ఖనిజ సంపద దోచేస్తున్నారు…..భూకబ్జాలు చేస్తున్నారు. చుక్కల భూమిపేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసి ప్రజల ఆస్తులు కొట్టేస్తున్నారు. ప్రతి రోజు ప్రజలు తమ భూములు ఉన్నాయో పోయాయో చూసుకోవాలి.మూడు రాజధానులు అనేది ఎక్కడైనా ఉందా?

మీకు మూడు రాజధానులు కావాలా….ఒక్క రాజధాని కావాలా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు ఒక్క రాజధానే అంటూ ప్రజల నినాదాలు.తాడేపల్లిలో ఉండే సిఎం మూడు రాజధానులపై ప్రజలు ఏమంటున్నారో చూడాలి. నేను వైసిపిలకు భయపడను..ప్రజలకు తప్ప ఎవరికీ భయపడను. పవన్ కళ్యాన్ విశాఖ పట్నం పోతే అక్కడా ఇబ్బంది పెట్టారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు
adoni5 వేస్తారా? బస్సు రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తారట. రేపు మేము కూడా వైసిపి నేతల ఇళ్లపై రోడ్లు వెయ్యలేమా…ఫ్లైవోవర్ లు కట్టలేమా? విశాఖలో మెడమీద కత్తిపెత్తి భూములు, వ్యాపారాలు రాయించుకుంటున్నారు. రాష్ట్రంలో జగన్, సైకో బ్యాచ్ మాత్రమే సంపాదించుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే టివి చానల్స్ ను ఉన్మాది జగన్ రెడ్డి రాకుండా చేస్తున్నాడు. నేను ఆరోజు ఇలా చేసి ఉంటే సాక్షి టివి, సాక్షి పేపర్ వచ్చేదా?మనకు నచ్చిన చానల్ ను కేబుల్ టివి వాళ్లు ప్రసారం చేయాలి. ప్రసారాలు కేబుల్ టివి నిర్వాహకుల దయాదాక్షిన్యాలు కాదు…..నిబంధనల ప్రకారం పని చేయాలి.సిఐడి అధికారులు అక్రమ కేసులు, అరెస్టులతో తప్పులు చేస్తున్నారు.

అన్న క్యాంటీన్ ఏం పాపం చేసింది. నా మీద పాపంతో నేను పెట్టిన అన్నక్యాంటీన్ లు మూసివేశాడు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ లను సిఎం స్టాలిన్ కొనసాగించాడు. ప్రభుత్వం మూసివేసిందని అన్న క్యాంటీన్ లు మేం పెడుతుంటే కూడా అడ్డుకుంటున్నాడు. మళ్లీ అధికారంలోకి రాగానే మండల కేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్ లు పెడతాము.

నేను సిఎంగా ఉండి ఉంటే పెన్షన్ 3 వేలు అయ్యేది. రూ. 200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు చేసింది టీడీపీనే.ఆంక్షలు పెట్టి పెళ్లి కానుక నిలిపివేశారు.చంద్రన్న భీమా పథకం నిలిపివేశారు. మట్టి ఖర్చులకు రూ.30 వేలు ఇచ్చాను. రంజాన్ తోఫా ఇచ్చాను.దుకాన్ మకాన్ పథకం నిలిపివేశారు.

తెలుగు దేశం బిసిల పార్టీ. వారికి నేను అండగా ఉంటా.వాల్మీకీ, కురబ, వడ్డెర, కమ్మరి, కుమ్మరి సహా అన్ని కులాలను ప్రభుత్వంలోకి వచ్చాక ఆదుకుంటాను.యవతకు జగన్ ఇచ్చిన ఉద్యోగాలు మటన్ కొట్లో ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం. రైతుల పిల్లలు, కూలీల పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాను.

యువత ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారు.సమాజాన్ని జగన్ రెడ్డి చెడగొడుతున్నాడు.సంక్షేమం నిలిపివేస్తాను అని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలుadoni4 చేస్తాను.బుద్ది ఉన్న సిఎం కలెక్టరేట్ లు, ప్రభుత్వ భవనాలు తాకట్టు పెడతారా.?ఇంకా యువతలో ఉన్న భయం పోవాలి. మీ ఎమ్మెల్యే కేసు పెడితే ఏమవుతుంది?నా అనుభవం ఉన్నంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు. నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎ చేశాను. మరి జగన్ ఎక్కడ చదువుకున్నాడు.?

Leave a Reply