Suryaa.co.in

Political News

జగనన్నపై జాలితో..

– కామెడీ పీస్ అయిపోతున్న జగన్
– ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతూ నవ్వుల పాలు
– వైసీపీ శ్రేణులతో సమావేశాల్లో అర్థంపర్ధం లేని సూక్తులు..సామెతలు
– జగన్ ప్రెస్ మీట్ అంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రోలర్స్
– తల పట్టుకుంటున్న వైసీపీ కేడర్
( రైతుబిడ్డ)

పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తే వారిలో స్ఫూర్తిని నింపాలి. చేయబోయే పోరాటాలకు సన్నద్ధం చేయాలి. వారిలో ధైర్యం నూరిపోయాలి. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వింతగా మాట్లాడుతూ తాను నవ్వులపాలు కావడమే కాకుండా పార్టీ శ్రేణుల్ని కూడా జోకర్లుగా మార్చుతున్నారు.

వారితో ఏం మాట్లాడాలో ముందుగా నిర్ణయించుకుంటారో లేదో తెలీదు కానీ…ఆ సమావేశాల్లో మాత్రం చెప్పే సూక్తులు వినలేక వైసీపీ నేతలే చెవుల్లో వేళ్లు పెట్టుకుంటున్నారు.

కొప్పు ఉంటే ముడేసుకోవచ్చు

అధికారం కోల్పోయిన కొత్తలో పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు జగన్. అప్పుడే ఎవరూ వినని కొత్త సామెతలను పరిచయం చేశారు. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు…జుట్టు లేకపోతే ముడేసుకోలేం…అధికారంలో ఉంటే సేవ చేయవచ్చు…అధికారంలో లేకపోతే సేవ చేయలేం అని వారిలో ఏదో స్థైర్యాన్ని నింపేలా మాట్లాడాలనుకున్నారు.

అయితే జగన్ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతలు వారిలో వారే నవ్వుకున్నారు. అసలు ఏం చెప్పాలనుకున్నారు…ఏం చెప్తున్నారని తమలో తామే ప్రశ్నించుకున్నారు. ఆ తర్వాత మరో సమావేశంలో మాట్లాడుతూ…బాటిల్ లో నీళ్లు కింద పోయవచ్చు…కింద పడిన నీళ్లను బాటిల్ లో పోయలేం అని మరో సూక్తి వదిలారు. చెప్పడం చేతకానప్పుడు ఏవేవో మాట్లాడి ప్రజల్లో పలచనవ్వడం అవసరమా అని, ఈ వీడియోలు నెటిజన్లు వైరల్ చేస్తుంటే చూసి తట్టుకోలేని అభిమానులు మదనపడుతున్నారు.

అయితే 2019కు ముందు అనర్ఘళంగా మాట్లాడిన జగన్.. సీఎం అయిన తర్వాత కూడా మాట్లాడటానికి తడబడ్డారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు వింటే నవ్వు ఆపుకోవడం అసాధ్యం. ఆయన పెట్టే ప్రెస్ మీట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అసలు జగన్ కు ఏమైందని వైసీపీ శ్రేణులు ఆవేదన పడుతున్నారు.

LEAVE A RESPONSE