Suryaa.co.in

Telangana

తెలంగాణాపై మోడీ విషం చిమ్మారు

-ఇక్కడ అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు
-ప్రసంగం ప్రధాని స్థాయిలో లేదు
-విద్వేషాన్ని రగిలించే యత్నం
-ఆ ప్రసంగం ఆసాంతం మోసపూరితమే
-తెలంగాణా లో అభివృద్ధి…బిజెపి పాలనలో అవినీతి
-ప్రతిఘటిస్తున్నందుకే ప్రతిపక్షాలపై ఈడి దాడులు
-కమల దళానికి జై కొడితే మాఫీ లు
-ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంటేనే వణుకుతున్న ఢిల్లీ బాస్ లు
–ప్రధాని మోడీ పై నిప్పులు చేరిగిన మంత్రి జగదీష్ రెడ్డి

రైల్ ఓపెనింగ్ పేరుతో తెలంగాణ లో పర్యటించిన ప్రధాని మోడీ ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో తనను కలిసిన మీడియాతో ఆయన ప్రధాని పర్యటన పై తీవ్రంగా స్పందించారు.

ఇక్కడ అభివృద్ధిని చూసి ప్రధాని మోడీ తట్టుకోలేక పోతున్నారని ఆయన విరుచుకుపడ్డారు.ప్రసంగం ఆసలు ప్రధాని హోదా కు తగ్గట్లే లేదని ఆయన దుయ్యబట్టారు. ఆ ప్రసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని ఆయన విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణాలో అభివృద్ధి పథంలో దూసుకు పోతుండగా బిజెపి పాలనలో అవినీతి మయంగా మారిందని ఆయన ఆరోపించారు.

బిజెపి ని ప్రతిఘటిస్తున్నందుకే బి ఆర్ యస్ తో సహా విపక్షాలపై సిబిఐ, ఈ డి,ఐ టి వంటి కేంద్ర సంస్థలను ఎగబెడ్తున్నారని ఆయన ఆరోపించారు. దారికి వచ్చి బిజెపి గూటికి చేరితే మాఫీ అని లేదు అంటే అక్రమ కేసులతో సతాయించడం ఢిల్లీ పెద్దలకు పరిపాటిగా మారిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని అందులో భాగమే ఈ రోజు పర్యటనలో తెలంగాణాపై ప్రధాని విద్వెషపు ప్రసంగమంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.

LEAVE A RESPONSE