జల్లయ్య హత్య రాజకీయ హత్య కానే కాదు

-రెండు కుటుంబాల మధ్య గొడవ అందుకు కారణం
-ఆ గొడవలో ఇరు వర్గాలకు వైస్‌ ఎంపీపీ సర్ది చెప్పారు
-జల్లయ్యను ఆస్పత్రికి తరలించించింది కూడా అతనే
-టీడీపీ నాయకులు హత్యను రాజకీయం చేస్తున్నారు
-మా పార్టీపైనా, నాపైనా నిందలు వేస్తున్నారు
-జల్లయ్యది ఒక నేరచరిత్ర. 10 కేసులో ఆయన ముద్దాయి
-ప్రెస్‌మీట్‌లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

మాచర్ల: ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..:
జల్లయ్యది రాజకీయ హత్య కాదు:
కంచర్ల జల్లయ్య. దుర్గి మండలం జంగమేశుపాడుకు చెందిన వ్యక్తి. గ్రామంలో పాత కక్షలు. ఎప్పుడూ గొడవలు. రెండు కుటుంబాల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు జరిగాయి. నిన్న ఒక చిన్న గొడవ జరిగి అది క్రమంగా పెద్దదై జల్లయ్యను కొట్టారు. దీంతో అక్కడే ఉన్న మా పార్టీకి చెందిన వైస్‌ ఎంపీపీ ఏగయ్య ఆ గొడవను ఆపి, జల్లయ్యను మాచర్ల ఆస్పత్రికి ఆటోలో తరలించాడు. మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేట తీసుకెళ్తుండగా చనిపోయాడు.

10 కేసుల్లో జల్లయ్య ముద్దాయి:
ఆ హత్యపై యావత్‌ టీడీపీ, ఇక్కడి ఆ పార్టీ ఇంఛార్జ్‌ బ్రహ్మారెడ్డి ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. కంచర్ల జల్లయ్య అనే వ్యక్తి ఏకంగా 10 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. దీన్ని చంద్రబాబుగారు తెలుసుకుని మాట్లాడాలి. ఆయన ఈ హత్యను నాకు ఆపాదిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు జల్లయ్యపై ఆ 10 కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్ని కేసుల్లో ఏ–1గానూ, మరి కొన్ని కేసుల్లో ఏ–2గానూ ఉన్నాడు.

స్వయంగా రాజీ చేయించాను:
అలాంటి వ్యక్తి (జల్లయ్య)తో పాటు, ఇరు వర్గాలను పిలిపించి, అతడిపై ఉన్న చక్కనయ్య అనే వ్యక్తి హత్య కేసును నేను రాజీ చేయించాను. దేవుడి మీద ప్రమాణం చేసి పంపించాను. చక్కనయ్య మా పార్టీకి చెందిన వ్యక్తి. అయినా ఈ ప్రాంతంలో ప్రశాంతత కోరుకుంటున్న నేను, ఆ కేసులో జల్లయ్య ఏ–1 ముద్దాయి కాగా, ఇరు వర్గాల మధ్య రాజీ చేసి, ఆ కేసు కొట్టేసేలా చూశాను. నేను రాజీ చేసిన హత్య కేసును 2022, జనవరి 24న కొట్టేశారు. నేనే పల్నాడులో ఫ్యాక్షనిజమ్‌ను ప్రోత్పహిస్తే, అలా రాజీ చేయించే వాణ్ని కాదు. శిక్షలు వేయించేవాణ్ని.

వారు ప్రశాంతత కోరడం లేదు:
ఇవాళ టీడీపీని, చంద్రబాబును చూస్తుంటే, వారికి పల్నాడు ప్ర«శాంతంగా ఉండాలని లేనట్లుంది. ఇక్కడ గొడవలు జరగాలని వారు కోరుతున్నారని అనిపిస్తోంది. నేను తొలిసారిగా 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి నాలుగుసార్లు గెల్చాను. గత 13 ఏళ్లలో ఎక్కడా ఇలాంటి రాజకీయాలు చేయలేదు.
కానీ మీరు బ్రహ్మారెడ్డి అనే ఫ్యాక్షనిస్టును ఇక్కడ ఇంఛార్జ్‌గా పంపించి, అతడు నీవు ఇద్దరూ కుమ్మక్కై ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలు చేస్తున్నారు.

ఆ ట్రాప్‌లో పడొద్దు:
నేను పల్నాడు వాసులను ఒకటే కోరుతున్నాను. పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ చిచ్చు పెట్టి, గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. వాళ్ల ట్రాప్‌లో పడొద్దు. ఆ పార్టీ ఇక్కడ గొడవలు సృష్టించి, రక్తపాతం జరిపి, దాంట్లో నుంచి ఓట్లు దండుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది. అందుకే ఇవాళ ఇక్కడికి బుద్ధా వెంకన్నను పంపించారు.
మొన్న మహానాడులో కూడా టీడీపీ నాయకులు ఏం మాట్లాడారు. బస్సు యాత్రలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులను లాగి కొడతామని అన్నారు. అంటే ఆ మాటలు కూడా చంద్రబాబు వారితో అనిపించాడు. అలా చంద్రబాబు ఇక్కడ వర్గాల మధ్య చిచ్చు పెట్టి, ఆ రక్తంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు.

చంద్రబాబు, బ్రహ్మారెడ్డి కారణం:
ఇవాళ ఇక్కడ జరుగుతున్న హత్యలకు చంద్రబాబు, ఆ పార్టీ ఇంఛార్జ్‌ బ్రహ్మారెడ్డి ఇద్దరే కారణం. ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి, ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు.
ఒకప్పుడు పల్నాడులో ఫ్యాక్షనిజమ్‌ ఉండేది. కానీ 2004లో వైయస్సార్‌ సీఎం అయిన తర్వాత, ఎక్కడా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి, ఎక్కడా ఫ్యాక్షన్‌ గొడవలు లేకుండా కృషి చేస్తున్నాను. అయితే చంద్రబాబు ఒక కుట్రతో ఫ్యాక్షనిజమ్‌ నేపథ్యం ఉన్న బ్రహ్మారెడ్డిని ఇక్కడికి ఇంఛార్జ్‌గా పంపించిన తర్వాతే ఇక్కడ హత్యా రాజకీయాలు మొదలయ్యాయి.

ఇదీ బ్రహ్మారెడ్డి చరిత్ర:
ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బ్రహ్మారెడ్డి, తన తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఒకేరోజు ఏడుగురిని దారుణంగా హతమార్చిన కేసులో ఏ–1 ముద్దాయి. అప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. అదే చంద్రబాబు రాజకీయ చరిత్ర. ఇవాళ కోనసీమలో కూడా ఆయన అదే రాజకీయం చేస్తున్నారు. అక్కడ జిల్లా పేరు మార్చడంతో, గొడవలు మొదలు పెట్టారు.

ప్రజలు గుర్తించాలి:
ఇక్కడ గడచిన 4 నెలల నుంచే గొడవలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించాలి. ఫ్యాక్షన్‌ చరిత్ర ఉన్న బ్రహ్మారెడ్డిని ఇక్కడ ఇంఛార్జ్‌గా నియమించి, చంద్రబాబు ఆ హత్యా రాజకీయాలు చేస్తున్నారు. అందుకే ఎవరూ చంద్రబాబు, టీడీపీ ట్రాప్‌లో పడొద్దని పల్నాడు వాసులను మరోసారి కోరుతున్నాను.
మళ్లీ గుర్తు చేస్తున్నాను. గత 13 ఏళ్లుగా లేని గొడవలు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?. బ్రహ్మారెడ్డి ఇక్కడ ఇంఛార్జ్‌గా వచ్చిన తర్వాతే అవి జరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్‌ కుట్రలు, బ్రహ్మారెడ్డి హత్యా రాజకీయాల ఉచ్చులో పడొద్దు. వారు ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారు.
ఎక్కడ ఏం జరిగినా, తమకు అనుకూలంగా మల్చుకుని రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. పల్నాడు ప్రాంత ప్రశాంతత ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి జరగాలి. అందుకే చంద్రబాబు, లోకేష్, బ్రహ్మారెడ్డి ఉచ్చులో పడొద్దు.

పల్నాడులో ఎన్నో అభివృద్ధి పనులు:
చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ పల్నాడును అభివృద్ధి చేయలేదు. గత మూడేళ్లుగా జగన్‌గారి హయాంలోనే ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.వరికపూడిసల ప్రాజెక్టు తెస్తున్నాం. రహదారులు నిర్మిస్తున్నాం. వరికపూడిసల ప్రాజెక్టు వల్ల 80 వేల ఎకరాలను నీరందుతుంది. ఆ ప్రాజెక్టుకు రెండుసార్లు భూమిపూజ చేసిన చంద్రబాబు, పనులు మాత్రం చేయలేదు. ఇప్పుడు జగన్‌ దాన్ని ఆమోదించారు.
ఇంకా ఇక్కడ రైతులకు ఉచితంగా బోర్లు తవ్వుతున్నాం. మాచర్ల నుంచి దావుపల్లి వరకు శ్రీశైలం రోడ్‌లో రూ.300 కోట్లతో హైవే రోడ్డును, మాచర్ల నుంచి దాచేపల్లి వరకు రూ.340 కోట్లతో రోడ్డు వేస్తున్నాం.

కక్ష కట్టిన చంద్రబాబు:
ప్రజలు ప్రశాంతంగా ఉంటే, తమకు ఓట్లు వేయడం లేదని చంద్రబాబు కక్ష కట్టారు. అందుకే ఇక్కడ కులాలు, వర్గాలను రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్లు సంపాదించాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల రెండు కుటుంబాల మధ్య గొడవతో చంద్రయ్య అనే వ్యక్తి చనిపోతే, దాన్ని కూడా మాకు ఆపాదించారు. చివరకు ఆయన పాడె కూడా మోసిన చంద్రబాబు, రాజకీయంగా ఆ స్థాయికి దిగజారారు.

Leave a Reply