సీఎం కేసీఆర్‌కు కాపు నేతల కృతజ్ఞతలు

తమిళనాడు మాజీ సీఎస్, జనసేన పార్టీ అడ్వైజర్, ప్రముఖ కాపు సమాజం నాయకులు ఆర్. రామ్మోహన్ రావు బుధవారం ప్రగతి భవన్ లో, బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జరిగిన సుధీర్ఘ భేటీలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు తదితర అంశాలపై చర్చజరిగింది.

తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారిని నియమించినందుకు బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బిఆర్ఎస్ ఏపీ నాయకుడు పార్థసారథి, ఆర్. రామ్మోహన్ రావు లు ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ని కలిసి కృతజ్జతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శాంతి కుమారిని వారు ఈ సందర్భంగా అభినందించారు.

Leave a Reply