– అన్నీ ఇల్లీగల్ పనులే
– బోనాలపల్లి గ్రామంలో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేస్తున్నారు
– సీపీ తన సతీమణి, ఫ్రెండ్స్ కలిసి ఇష్టం వచ్చినట్లు ఫైరింగ్ చేస్తున్నారు
– ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుతున్నారు
– నేను మాట్లాడేది వాస్తవం.. అబద్దం అయితే ముక్కు నేలకు రాస్తా
-స్టేట్ మెంట్ ఇచ్చి పారిపోవడం కాదు.. అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ పెట్టాలి
– అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాల్లో ఏం జరుగుతుందో వివరాలతో సహా మీడియాకు తెలియజేస్తున్న. కరీంనగర్ సీపీ ఆలం గౌస్ తనకున్న పవర్ ను ఉపయోగించి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. కరీంనగర్ లో సీపీ జల్సాలు ఎక్కువ అయిపోయాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి బోనాలపల్లి గ్రామంలో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేస్తున్నాడు.
సిపి చేసిన ఫైరింగ్ లో అమృతమ్మ అనే వృద్ధురాల తొడకు గాయమైంది. మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి పత్రికలో వార్త వచ్చింది. ఫైరింగ్ రేంజ్ లో పోలీస్ మిత్రులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం తప్పులేదు. కరీంనగర్ సీపీ ఆలం గౌస్ తన సతీమణి, ఫ్రెండ్స్ కలిసి ఇష్టం వచ్చినట్లు ఫైరింగ్ చేస్తున్నారు. 180 బుల్లెట్లు ఫైరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేను మాట్లాడేది వాస్తవం, అబద్దం అయితే ముక్కు నేలకు రాస్తాను.
కరీంనగర్ సీపీ ప్రవేయిట్ వ్యక్తులతో కలిసి ఫైరింగ్ చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండనే ఉంటుందా? కరీంనగర్ సీపీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? బిఆర్ఎస్ నాయకుల పై ఏం ఏం కేసులు ఉన్నాయో బయటకు తియ్యండి అని ఆదేశాలు ఇచ్చే రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు కరీంనగర్ సీపీ ఇల్లీగల్ వ్యవహార శైలి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే మొన్న CID అధికారులు నా పై కేసు పెట్టారు. ప్రభుత్వ వాహనాన్ని ప్రవేయిట్ వ్యక్తులు వాడుతుంటే ఆధారాలతో సహా నేను బయట పెట్టాను. ఇంతవరకు వారి పై చర్యలు తీసుకోలేదు. కరీంనగర్ సీపీ ఎప్పుడు ఫైరింగ్ చేస్తాడో తెలియక బోనాలపల్లి గ్రామ ప్రజలు భయపడుతున్నారు.
ఒక్కరిద్దరు IAS , IPS అధికారుల వ్యవహార శైలి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నేను అనని వ్యాఖ్యలకు అన్నట్లు నా పై కేసు నమోదు చేశారు. మత మార్పిడి వ్యాఖ్యలు నేను ఎక్కడ చేయలేదు,.నేను చేసినట్లు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. కరీంనగర్ సీపీ గౌస్ మాటలు నమ్మి IPS అధికారుల అసోసియోషన్ క్షమాపణ చెప్పాలని లేఖ రాశారు. ఇప్పటికైన కరీంనగర్ సీపీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న.
ఇదే విషయాన్ని స్పీకర్ పర్మిషన్ తో ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతాను. ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుతున్నారు. ఆధారాలతో సహ బయటపెడితే చర్యలే లేవు. మా నాయకుడు కేటీఆర్ పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్ట్ లు పెడుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు సవాల్ విసురుతున్న. మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ ఇచ్చి పారిపోవడం కాదు, అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారో అప్పుడు తెలుస్తుంది. డ్రగ్ టెస్ట్ మాత్రమే కాదు మద్యం టెస్ట్ సైతం అసెంబ్లీలో పెట్టాలి. ఎవరు ఎవరు ఎంత మద్యం తాగారో, తాగి ఎవరు వచ్చారో అప్పుడు తెలుస్తుంది.