Suryaa.co.in

Andhra Pradesh

బ్యాంకులను మోసగించినట్లు ప్రజలను చేయలేవు

-నీ బాగోతం పిల్లాడిని అడిగినా చెబుతాడు…
-ఎంపీ, కేంద్రమంత్రిగా ఏమైనా చేశావా?
-సుజనాచౌదరిపై కేశినేని నాని ఫైర్‌

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్‌లో శనివారం వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరిపై వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ప్రకాశం బ్యారేజ్‌ కట్టింది మీ నాన్న అంటున్నావ్‌… కనకదుర్గ ఫ్లైఓవర్‌, బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌, ఎయిర్‌పోర్ట్‌ కట్టించింది నువ్వు అంటున్నావ్‌… నువ్వు చెప్పే సొల్లు మాటలు వినడానికి విజయవాడ ప్రజలు సిద్ధంగా లేరు. బీసీలు, మైనారిటీలను మోసం చేసి దొడ్డి దారిలో సీటు సంపాదించి విజయవాడ వెస్ట్‌లో పోటీ చేస్తున్నావు.

నువ్వు, నీ బ్యాంకు స్కామ్‌ల గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఏ ఉదేశం తో ఇక్కడ పోటీ చేస్తున్నావో సమాధానం చెప్పాలని కోరారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశావు.. మూడు సార్లు కేంద్ర మంత్రిగా చేశావు..నీ వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లా, విజయవాడ పార్లమెంట్‌, విజయవాడ వెస్ట్‌కు ఏమైనా అభివృద్ధి జరిగిందా అని నిలదీశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పు డు రూ.40 కోట్లు ఎంపీ నిధులు వచ్చేవి. ఆ నిధులను ఏ నియోజకవర్గానికి ఖర్చు చేశావో చెప్పాలని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా విజ యవాడ వెస్ట్‌ను బెస్ట్‌ చేస్తా అని మాట్లాడుతున్నావు…బ్యాంకులను మోసగించినట్టు విజయవాడ ప్రజలను చేయలేవు. నీకు ప్రజలే బుద్ధి చెబుతారు. అసిఫ్‌ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE