Home » రాష్ట్రంలో పరిపాలన లేదు..పగలు, ప్రతీకారాలే ఉన్నాయి

రాష్ట్రంలో పరిపాలన లేదు..పగలు, ప్రతీకారాలే ఉన్నాయి

-చెరో 8 స్థానాలు…బీజేపీ, కాంగ్రెస్‌ ఒప్పందం ఇదీ..
– హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సమైక్యవాదులు అంటున్నారు
– రేవంత్‌కు ఆంధ్రా మూలాలు…తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం… ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
– రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా?
– రేవంత్‌ మాటలతో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయింది…పరిశ్రమలకు ఇబ్బందులు
– ప్రజాపాలన అర్జీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది
– మీట్‌ ద ప్రెస్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో శనివారం జరిగిన మీట్‌ ద ప్రెస్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు అడగాలని కోరారు. కాంగ్రెస్‌ బాండు పేపర్‌ బౌన్స్‌ అయింది. అందుకు శిక్ష వేయాలని ప్రజలను నిర్ణయించారు. అప్పుడు హామీలు… ఇప్పుడు దేవు ళ్లపై ఒట్లు వేస్తున్నారు.. హామీలు అమలు కావడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలని దూషిస్తున్నారు. ఢల్లీికి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలు, పరిపాలనపై లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను, ఆయన సీనియారిటీని గౌరవించకుండా రేవంత్‌ కళ్లు పీకుతా, పేగులు మెడలో వేసు కుంటా అని దుర్భాషలాడుతున్నారు. కేసీఆర్‌ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తానం టు న్నాడు. రాష్ట్రంలో పరిపాలన లేదు, పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజాపాలనలో 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

కాంగ్రెస్‌, బీజేపీ ఒప్పందం ఇదీ…
ఈ ఎన్నికల్లో 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్‌, 8 సీట్లలో కాంగ్రెస్‌ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేసుకు న్నాయి. అందుకు అనుగుణంగానే వారు పనిచేసుకుంటున్నార. మరోవైపు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని గా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు. రేవంత్‌ రెడ్డికి ఆంధ్రా మూలాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం ఏడు మండలాలను ఏపీకి ఇచ్చాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్‌ఎస్‌ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు. కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదు. వడ్లు కొనాలంటే నూకలు తినండి అని కేంద్ర మంత్రులు అన్నారు.

కేసీఆర్‌ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొన కుండా వివక్ష చూపారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు, నిరుద్యోగులు, మహి ళలు.. ఏ ఒక్క వర్గానికీ బీజేపీ మేలు చేయలేదు. కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్‌ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్‌ కిట్‌, తాగునీళ్లు ఇచ్చిండు. బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఆదానీని ప్రపంచ కుబేరుల్లో టాప్‌ టెన్‌లో నిలబెట్టిం ది. నల్లచట్టాలు తెచ్చి లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను పొట్టనబెట్టుకుంది. స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి మోసం చేసింది. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి బిల్లు పెట్టలేదు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు.

కేసీఆర్‌ కంటే ధార్మికుడు మరొకరున్నారా?
యాదాద్రిని అద్భుతంగా కట్టింది కేసీఆర్‌. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు కొరత రాకుండా చూశారు. ఆధ్యాత్మికంలో ఆయన బీజేపీకంటే రెండు అడుగులు ముందు ఉన్నారు. కేసీఆర్‌ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కంటే బీఆర్‌ఎస్‌కే ఎక్కువ వస్తాయి. నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో వస్తుంది. రివర్స్‌ గేర్‌లో పోతున్న కాంగ్రెస్‌ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రం దివాళా తీసిందనే ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? రేవంత్‌ మాటల వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గింది. పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. కేసీఆర్‌ హయాంలో నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. మీకు పాలన చేతకాక రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళుతున్నారు. రేవంత్‌ బీజేపీలో చేరతారని అరవింద్‌, మహేశ్వర్‌ రెడ్డి అంటున్నారు. దీన్ని రేవత్‌ ఎందుకు ఖండిరచడం లేదు.

అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు గుంజావ్‌…
కవిత అరెస్టు కాలేదు కనుక బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటని అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు సంపాదించుకు న్నారు. ఇప్పుడు కవిత అరెస్టయ్యారు, కుమ్మక్కయితే ఎందుకు అరెస్ట్‌ అవుతారు. రేవంత్‌ మైనారిటీలను మోసం చేస్తున్నారు. కేబినెట్‌లో వారిని తీసుకోలేదు. రంజాన్‌ తోఫా నిలిపేశారు. ఇమామ్‌ వేతనాలు రావడం లేదు. రేవంత్‌ మోదీని బడే భాయ్‌ అంటూ ఆశీర్వాదాలు కోరుతున్నారు. బీఆర్‌ఎస్‌ అన్ని వర్గాల పార్టీ. మైనారిటీలకు అన్యాయం జరిగితే పోరాడుతుంది. హిందూ, ముస్లింలను రెండు కళ్లలా చూసే పార్టీ బీఆర్‌ ఎస్‌ అన్నారు. కాంగ్రెస్‌ హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని వెల్లడిరచారు.

Leave a Reply