Suryaa.co.in

Telangana

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేద్దాం

– భాగ్యలక్ష్మి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి. కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్లోని చార్మినార్ను వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

‘‘దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నటువంటి 41 మంది కార్మికులు సొరంగం నుంచి 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయం. వాళ్లు, ధైర్యంగా బయటకు వచ్చినందుకు అమ్మవారికి ఈరోజు ప్రార్థనలు చేశాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి కార్మికులను బయటకు తీసుకురావడం గొప్ప విషయం”అని అన్నారు.

ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజలెవరూ డబ్బులు సహా ఇతర ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.

రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత, ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

LEAVE A RESPONSE