ప్రసాద్ స్కీంలో కోటప్పకొండ, ఒంటిమిట్ట ఆలయాలు

కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీంలో  పల్నాడులోని కోటప్పకొండ, ఒంటిమిట్టలోని కోదండరామ ఆలయాలను చేర్చాలని కోరుతూ లేఖ ద్వారా పంపిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యుత్తరంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం సోషల్ మీడియాలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి ప్రాజక్టు ప్రపోజల్ పంపిస్తుందని అన్నారు. ప్రసాద్ స్కీం కింద దేశంలో మతపరమైన పర్యాటక కేంద్రాలు, తీర్ధయాత్రల ప్రదేశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి, నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప చొరవ అని ఆయన కొనియాడారు.

Leave a Reply