తెలుగుదేశం కూటమివిజయం ప్రజా విజయం ; వై వి బి రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు: రాష్ట్రంలో టీడీపి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా స్థానిక వీరమ్మతల్లి ఆటో యూనియన్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి విజయానికి కృషి చేసినందుకు రాజేంద్ర ప్రసాద్ ని అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయం ప్రజా విజయమని , పరదాల పాలన పోయి ప్రజా పాలన వచ్చినందుకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర సాధికార కన్వీనర్ జంపన శ్రీనివాస్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి,యూనియన్ నాయకులు శివ శక్తి,సతీష్,ఇంకా యూనియన్ నాయకులు పాల్గొన్నారు.