Suryaa.co.in

Telangana

వెంటనే తులం బంగారం ఇవ్వాలి

– ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇందల్వాయి: వేములవాడ రోజుకొక రాజన్న కోడె మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆలయాల పై ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశాం. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ రూ 2 వేల కోట్లు ఖర్చు చేశారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు. మహిళలకు 2500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. కల్యాణలక్ష్మి లో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలి.

LEAVE A RESPONSE