– గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్
– ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: లిక్కర్ స్కాం కేసులో అత్యంత కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సమయం పట్టేట్టు ఉండడంతో, రేపు సిట్ విచారణకు హాజరవుతున్నానని రాజ్ కసిరెడ్డి స్వయంగా వెల్లడించిన కాసేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజ్ కసిరెడ్డి గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ రాగా, పక్కా సమాచారంతో పట్టుకుని విజయవాడ తీసుకువచ్చారు. దీనితో లిక్కర్ స్కాం కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది. సిట్ పోలీసులకు ఆడియో రికార్డులు పంపిన కసిరెడ్డిని పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు, తమపై వస్తున్న విమర్శలకు తెరదింపారు.