Suryaa.co.in

Telangana

జడ్జి ముందు మీడియా సాక్షిగా లైవ్ డిబేట్

– రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఆఫర్
– రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి
– చట్టాన్ని గౌరవించే వ్యక్తిని
– తేదీ, సమయం రేవంత్ రెడ్డే నిర్ణయించాలి
– ఇలా అయితే ఓ యాభై లక్షల్లో నిజం తెలుస్తుంది
– రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీ
– ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్

హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. రాజకీయ వేధింపు,కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెడితే విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న తొమ్మిది తారీఖునాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను.

రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు గంటల పాటు అడిగి వివరాలు తీసుకున్నాయి..ఈ రెండు సంస్థలకు ఒక్కటే మాట చెప్పిన. మీరు ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సమాధానం చెబుతాను. పూర్తిగా విచారణకు సహకరిస్తానన్నాను.

ఈ విచారణకు 10 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అసలు అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృథా చేయడం ఎందుకు? ఆ పైసల తోని రైతు రుణమాఫీ చేయొచ్చు? ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయవచ్చు.

అందుకే సంక్రాంతి పండగ సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. హైకోర్టు న్యాయమూర్తికాని, ఇంకా ఏవరైనా న్యాయమూర్తి ముందు మీడియా సాక్షిగా లైవ్ డిబెట్ కు పోదాం.

రేవంత్ రెడ్డి ప్యాలెస్ లో అయినా ఈడీ ఆఫీస్ లో అయినా, న్యాయమూర్తి ముందు అయినా లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ. దొంగెవరో? దొరెవరో? ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి. ఫార్ములా ఈ కార్ రేసు, ఓటుకు నోటు కేసులకు సంబంధించి రేవంత్ ను, నన్ను ప్రశ్నలు అడగండి. నేను సమాధానం చెప్తాను. ఆయన కూడా జవాబు చెప్పాలి.
తేదీ, సమయం రేవంత్ రెడ్డే నిర్ణయించాలి. ఇలా అయితే ఓ యాభై లక్షల్లో మొత్తం నిజం తెలుస్తుంది.

ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీ కి రేవంత్ రెడ్డి దొరికిండు కాబట్టే నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టిచ్చిండు. రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టే నా మీద ఈ ఈడీ విచారణ జరిపిస్తున్నారు. అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుంది.

హైకోర్టు. సుప్రీంకోర్టు. భారత న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కాకుండా ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు.

8 గంటలు వాళ్ళ ఇదే అడిగారు నేను ఇదే చెప్పారు తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీ. పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగాను ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. అన్నింటికి సమాధానాలు ఇచ్చాను.

LEAVE A RESPONSE