తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతుంది

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

రాష్ట్రంలో వరుసగా విద్యుత్ తీగలు ఎందుకు తెగిపడుతున్నాయి? ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎవరు? ఆ పనులు ఇప్పించిన ప్రభుత్వ పెద్దలు ఎవరు? తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ డొంక కదులుతుంది. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. విద్యుత్ తీగలు తెగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అనంతపురం జిల్లా, బొమ్మనహాల్ మండలం, దర్గాహోన్నూరు ట్రాక్టర్ పై విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు చనిపోవడం, పలువురు పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరం. నాలుగు రోజుల క్రితమే కడప జిల్లా, చాపాడు మండలం, చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిపడి కాలికి తగలడంతో ముగ్గురు రైతులు మరణించారు. ప్రమాదం జరిగిన ప్రతి సారి ఉడత కధ చెప్పి తప్పించుకోవడం, దేవుడి ఖాతా లో వేసి చేతులు దులుపుకోవడం జగన్ సర్కార్ కి అలవాటుగా మారింది. విద్యుత్ తీగలు తెగిపడి కూలీల మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే… బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన కూలీల కుటుంబాలను ఆదుకోవాలి, తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ లోపాల పై తక్షణమే అధ్యయనం చెయ్యాలి.

Leave a Reply