పదో తరగతి విద్యార్థులవి ఆత్మహత్యలు కావు ప్రిజనరీ జగన్ రెడ్డి ప్రభుత్వ హత్యలే…

-విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ రిజల్ట్స్ వచ్చాయి. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసిన తరువాత షాక్ కి గురయ్యాను. కనీస అవగాహన లేని ప్రిజనరీ వ్యక్తి సీఎం అయితే ఎంత ప్రమాదమో చూస్తున్నాం.ప్రిజనరీ జగన్ రెడ్డి చేతగాని విద్యా వ్యవస్థను నాశనం చేసారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి పరీక్షలు రాసిన జగన్ రెడ్డికి విద్యార్థుల కష్టం ఎం తెలుస్తుంది.

పరీక్షల నిర్వహణ నుండి రిజల్ట్స్ ప్రకటించే వరకూ అంతా గందరగోళమే. పరీక్షల సమయంలో కూడా కరెంట్ కోతలు పెట్టిన చెత్త ప్రభుత్వం ఇది. ఫెయిల్ అయ్యింది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాదు…జగన్
Whats-App-Image-2022-06-09-at-12-49-55-PM సర్కార్ ఫెయిల్ అయ్యింది.నాడు (2018) టిడిపి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన టెన్త్ ప‌రీక్ష‌ల్లో 94.48 శాతం పాస్ పర్సంటేజ్.నేడు జగన్ రెడ్డి పాలన లో 67.26 శాతం పాస్ పర్సంటేజ్.గత 20 ఏళ్లలో ఇదే అతి తక్కువ పాస్ పర్సంటేజ్.

71 ప్రభుత్వ స్కూళ్ల‌లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడం దారుణం.రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం ఏంటి అని అందరూ బాధపడుతుంటే జగన్ రెడ్డి మాత్రం హ్యాపీగా వేల కోట్లు అమ్మ ఒడి డబ్బులు మిగిలాయని సంబరాలు చేసుకుంటున్నారు.

నాడు- నేడు లో భారీగా అవినీతికి పాల్పడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించారు.నాడు- నేడు లో స్కూళ్లు బాగుపడలేదు… వైసిపి నాయకులు బాగుపడ్డారు.పిల్లల పేరు చెప్పి రూ.3500 కోట్లు కొట్టేసారు.పైకప్పు ఊడి పిల్లల తలలు పగులుతున్నాయి. నాడు- నేడు పనులు ఎంత గొప్పగా చేసారో అర్ధం అవుతుంది.ఉపాధ్యాయులు దేవుడితో సమానం. అందరూ గురువుల్ని గౌరవిస్తాం.కానీ ప్రిజనరీ జగన్ రెడ్డి గురువులను ఘోరంగా అవమానించాడు.

మద్యం షాపుల ముందు ఉపాధ్యాయులను కాపలా పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.చదువు చెప్పాల్సిన టీచర్ల ను జగన్ రెడ్డి టార్చర్ చేసారు. మరుగు దొడ్ల ఫోటోలు తియ్యాలి యాప్ లో అప్ లోడ్ చెయ్యాలి,
Whats-App-Image-2022-06-09-at-12-49-55-PM-1 భోజనాల ఫోటోలు తియ్యాలి యాప్ లో అప్ లోడ్ చెయ్యాలి.నాడు- నేడు టీచర్ల పనా? మరి విద్యార్థులకు చదువు ఎవరు చెబుతారు?వారంలో సిపిఎస్ రద్దు చేస్తా, అదిరిపోయే పీఆర్సీ ఇస్తా అని హామీ ఇచ్చి ఉపాధ్యాయులను మోసం చేసారు. హక్కుల కోసం పోరాడిన ఉపాధ్యాయులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.

జగన్ రెడ్డి చెత్త నిర్ణయాల వలన చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడెక్కి పోరాటాలు చెయ్యాల్సిన దుస్థితి వచ్చింది.ప్ర‌తీయేటా మెగా డీయస్సీలో టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మూడేళ్ల‌లో ఒక్క కొత్త టీచర్ ని కూడా నియమించలేదు.విద్యార్థుల‌కి చ‌దువు చెప్పే టీచర్లు లేకే ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయి.ఎయిడెడ్ పాఠశాలల ర‌ద్దు, పరీక్ష పత్రాల త‌యారీ విధానంలో లోపాల‌తో 20 ఏళ్ల‌లో ఎన్న‌డూ రాని దారుణ ఫ‌లితాలు వవచ్చాయి.దశల వారిగా చేపట్టాల్సిన సంస్కరణలు ఒక్క సారిగా తీసుకురావడం కూడా ఫెయిల్ పర్సంటేజ్ పెరగడానికి కారణం. అమ్మ ఒడి ఇవ్వ‌డానికి నిధుల్లేక‌-అప్పులు దొర‌క్క ఇప్ప‌టికే వాయిదాలు వేసుకుంటూ వ‌చ్చిన ప్ర‌భుత్వం ల‌బ్ధిదారుల‌ను త‌గ్గించే కుట్‌యలో భాగంగానే టెన్త్ ఫ‌లితాల్లో అత్య‌ధికుల్ని ఫెయిల్ చేసింద‌నే అనుమానాలున్నాయి.

టెన్త్ అతి ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంట‌ర్‌-పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని కుట్ర‌తోనే అతి ఎక్కువ‌మంద‌ని ఫెయిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఒక్కో నియోజకవర్గంలో 10 వేల మందిని అమ్మ ఒడి నుండి తొలగిస్తున్నారు.టిడిపి ప్రభుత్వహయాంలో నిరంతర పర్యవేక్షణ , డీయస్సీలద్వారా టీచర్ల కొరత తీర్చటం , వారికి ప్రమోషన్లు ఇవ్వటం, మెరుగైన పీఆర్సీ ఇవ్వటంవల్ల ఎంతో ఉత్సాహంగా పనిచేసిన టీచ‌ర్లు టెన్త్ ప‌రీక్ష‌ల్లో ప్రతి సారీ 90 శాతం పైనే ఫలితాలు సాధించ‌డానికి కృషి చేసారు.

బెండ‌పూడిలో ప‌దేళ్లుగా ప్ర‌సాద్ అనే టీచ‌ర్ ఎన్నారైల స‌హ‌కారంతో విద్యార్థులను అమెరిక‌న్ యాసెంట్ లో మాట్లాడేలా తీర్చిదిద్దితే, ఆ ఘ‌న‌త త‌న‌ ఖాతాలో వేసుకున్నారు జగన్ రెడ్డి.ఇప్పుడు 2 లక్షల మంది ఫెయిల్ అయితే అది మాత్రం జగన్ రెడ్డి ఖాతాలో వేసుకోరట.ప్ర‌భుత్వం చేత‌కానిత‌నం, మూర్ఖ‌త్వం, విద్యార్థుల సంక్షేమ ప‌థ‌కాలు త‌గ్గించాల‌నే కుట్ర‌కి ల‌క్ష‌లాది మంది విద్యార్థులు బ‌లి అయ్యారు.చెత్త ప్రభుత్వం, చేతగాని సీఎం వలన టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం.ఎవ్వరూ అధైర్య పడొద్దు పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ ప్రకటనలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా టిడిపి పోరాడుతుంది.

రీవాల్యుయేషన్ కాదు రీ వెరిఫికేషన్ చేయాలి.రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు రద్దు చెయ్యాలి. పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలి.సిఎం, విద్యా శాఖ మంత్రి సమీక్ష చేసి వెంటనే వైట్ పేపర్ విడుదల చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ ఎంతో బయట పెట్టాలి. పదో తరగతి విద్యార్థులవి ఆత్మహత్యలు కావు ప్రిజనరీ జగన్ రెడ్డి హత్యలే.చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. తెలుగుదేశం పార్టీ విద్యార్థుల తరపున పోరాడుతుంది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు మా వంతు సహాయం అందిస్తాం.

Leave a Reply