ప్రజల్లోకి వెళుతున్న లోకేష్‌ యువగళం

– లోకేష్‌కు పాదయాత్రలో జాగ్రత్తలు చెప్పిన కంభంపాటి

తెలుగుదేశం పార్టీ పోరాట యోధుడు, ఆంధ్రుల ఆశాకిరణం నారా లోకేశ్ పాదయాత్ర ‘‘యువగళం’’ 36వ రోజు పీలేరులో సోమవారం టిడిపి జాతీయ ప్రధానా కార్యదర్శి కంభంపాటి రామమోహన రావు పాల్గొన్నారు. టిడిపి అధినేత నాారా చంద్రబాబు నాయుడు గతంలో ‘‘వస్తున్నా మీకోసం’’ యాత్ర కన్నా మరింత జోష్ తో ‘‘యువగళం’’ యాత్ర ఉత్సాహంగా ఉరకెత్తడంపై అభినందనలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో ఎన్టీఆర్ స్ఫూర్తితో , చంద్రబాబు బాటలో నారా లోకేశ్ ముందడుగేయాలని, ఈ యాత్ర యావత్ తెలుగువారికే దిక్సూచి కావాలని కంభంపాటి రామమోహన్ ఆకాంక్షించారు.

వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని యాత్ర సమయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబుల యాత్రల సందర్భంగా తీసుకున్న చర్యలను గుర్తుచేస్తూ, అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తూ ‘‘యువగళం’’ వెన్నంటే నడుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తూ, నిర్విఘ్నంగా, నిర్దిష్ట లక్ష్యం వైపు సాగిపోవాలని అభిలషించారు.

Leave a Reply