– ఎనిమిది శ్మశానవాటికలను అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేయించిన మంత్రి నారా లోకేష్
– మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో అభివృద్ది పనులను ప్రారంభించిన స్థానిక నాయకులు
తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో ఒకప్పుడు చెట్లు, పుట్టల మధ్య దర్శనమిచ్చే శ్మశాన వాటికలు ఇప్పుడు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ కృషితో నియోజకవర్గంలోని అన్ని సామాజికవర్గాల శ్మశాన వాటికల రూపురేఖలు మారుతున్నాయి. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో వడ్డేశ్వరం గ్రామంలో ఉన్న ఎనిమిది శ్మశాన వాటికలను అధునాతన సౌకర్యాలతో అభివృద్ది చేయించారు.
ఆ అభివృద్ధి పనులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక నాయకులు సోమవారం ప్రారంభించారు. గ్రామంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలకు చుట్టూర ప్రహరీ గోడలు లేకపోవడంతో పాటు ఇతర సమస్యను గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన త్వరితగతన సొంత నిధులతో అభివృద్ధి పనులను చేయించారు. ప్రత్యేక నిర్మాణాలతో కూడిన చితులు, వెయిటింగ్ హాళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి సదుపాయాలతో అభివృద్ధి పనులు చేయించారు.
కేశ ఖండనం, దుస్తులు మార్చుకునేందుకూ గదులతో పాటు బూడిద నిల్వ సౌకర్యం వంటివి అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనితో గ్రామస్తులు మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో వడ్డేశ్వరంలో గ్రామంలో హిందూ, ముస్లిం, మాదిగ, మాల, గౌడ, రజక, కన్వెర్టడ్, యాదవ-మరాఠి, సామాజికవర్గాల శ్మశాన వాటికలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అన్ని మతాలకు చెందిన శ్మశానవాటికలను మంత్రి నారా లోకేష్ దశల వారీగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధి దేశంలోని ఏ నియోజకవర్గంలో కూడా చేయడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈపూరి బాబు, నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు, ఎర్రగుంట్ల భాగ్య రావు, మల్లవరపు వెంకట్, షేక్ రియాజ్, వేమూరి మైనర్ బాబు, ఎండీ ఇబ్రహీం, కొల్లి శేషు, దాసరి కృష్ణ, కాంట్రాక్టర్ వెలగపూడి కిషోర్ బాబు, బొర్రా కృష్ణ వందన, షేక్ అక్రమ్, ఎస్.కె ఇబ్రహీం, యలమంచిలి పద్మజ, మద్దినేని సుబ్రహ్మణ్యం, జోరుగా దాసు, గుంపెన నాగేశ్వరరావు, షేక్ ఇమాంస, అంజుమన్, కమిటీ పెద్దలు, క్రిస్టియన్ పాస్టర్లు, గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.