Suryaa.co.in

Telangana

మేడిగడ్డ బ్యారేజ్‌ దగ్గర మళ్లీ భారీ శబ్దాలు

భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌ దగ్గర మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజ్‌ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందన్న అనుమానంతో పనులు నిలిపివేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకు పోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE