ఏలూరు: వివాహ బంధంతో ఒకటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన కార్యాలయం సిబ్బంది ద్వారా “మహేష్ అన్న పెళ్లి కానుక” అందజేశారు.
దెందులూరు మండలం, అలుగులగూడెం గ్రామానికి చెందిన దాసే చింతయ్య, రంగమ్మ దంపతుల కుమారుడు ఉదయ భాస్కర్ కు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంనకు చెందిన జాస్మిన్ రాణితో ఏలూరు పట్టణ పరిధిలోని కండ్రిక గూడెం సెంటర్ లో గల శుభలేఖ కళ్యాణ మండపంలో మంగళవారం వైభవంగా వివాహం జరిగింది.
ఆహ్వానితుల పిలుపు మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా “మహేష్ అన్న పెళ్లి కానుక” అందజేయించారు. అలాగే నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.