వైద్య ఆరోగ్య రంగంలో సంచ‌ల‌న మార్పులు

-వేల కోట్లతో కొత్త ఆస్ప‌త్రుల నిర్మాణం
-పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు జ‌గ‌న‌న్న ధైర్యంగా ముందుకెళుతున్నారు
-16వేల కోట్ల‌తో ఆస్ప‌త్రుల ఆధునికీక‌ర‌ణ‌, నిర్మాణం
-492 మందుల‌కు ధ‌ర ఒప్పందం
-కేంద్రీయ ఔష‌ధ గిడ్డంగుల‌ను పటిష్ట‌ప‌రుస్తున్నాం
-వైజాగ్ కేజీహెచ్ కు త్వ‌రలోనే నూత‌న సిటీ, ఎమ్మారై మిష‌న్లు
-తాజా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రూ.130 కోట్ల‌తో ప‌రిక‌రాల కొనుగోలు
-నూత‌న యూపీహెచ్‌సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల కోసం రూ.220 కోట్ల‌తో ప‌రిక‌రాల కొనుగోలు
-రాష్ట్రంలో 67 చోట్ల రూ.5.36 కోట్ల‌తో ప్ర‌సూతి వార్డుల అభివృద్ధి
-క‌ర్నూలులోని స్టేట్ క్యాన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.90 కోట్ల‌తో ప‌రిక‌రాల కొనుగోలు
-రాష్ట్ర‌వ్యాప్తంగా ఆస్ప‌త్రుల‌కు రోగ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల కోసం 64 ర‌కాల ప‌రికరాల కొనుగోలు
-వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని

వైద్య ఆరోగ్య రంగంలో సంచ‌లన మార్పులు దిశ‌గా త‌మ ప్ర‌భుత్వం ప‌య‌నిస్తోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. రాష్ట్ర స‌చివాల‌యం ఐదో బ్లాక్‌లోని క‌లెక్ట‌ర్స్ కాన్ఫ‌రెన్స్ హాలులో గురువారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఏపీఎంఎస్ ఐ డీసీ (ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సేవ‌లు, వ‌స‌తుల అభివృద్ధి సంస్థ‌) విభాగంపై పూర్తి స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద‌లంద‌రికీ నాణ్య‌మైన వైద్యం పూర్తి ఉచితంగా, సులువుగా అందాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నార‌ని తెలిపారు. ఎన్ని వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌యినా స‌రే వెర‌వ‌కుండా వైద్య ఆరోగ్య‌ శాఖ‌కు అంద‌జేస్తూ పూర్తిగా అండ‌గా ఉంటున్నార‌ని కొనియాడారు.

గ్రామ‌స్థాయి నుంచి వైద్య ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట‌ప‌రిచేందుకు వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల‌ను తీసుకొచ్చార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 10032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మాణంలో ఉన్నాయ‌ని చెప్పారు. 528 అర్బ‌న్ హెల్త్ క్లినిక్‌లు, 1125పీహెచ్‌సీలు, 168 ఏపీవీవీపీ ఆస్ప‌త్రుల నిర్మాణం, ఆధునికీక‌ర‌ణ‌, ప‌లాస‌లో కిడ్నీ రీసెర్చి సెంట‌ర్‌, 16 మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణం, 13 మెడిక‌ల్ క‌ళాశాల‌ల ఆధునికీక‌ర‌ణ‌, ఐదు చోట్ల ట్రైబ‌ల్ మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల నిర్మాణం, క‌డ‌ప‌లో క్యాన్స‌ర్‌, మెంట‌ల్ హెల్త్‌, సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల నిర్మాణం కోసం మొత్తం రూ.16,252 కోట్ల ను త‌మ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న‌ద‌ని తెలిపారు.
వీటిలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, ఐదు మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణం ఈ ఏడాది చివ‌రిక‌ల్లా పూర్తి కావాల్సి ఉంద‌ని, ఆ ప‌నులు స‌కాలంలో పూర్త‌య్యేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

సీఎంఎస్‌ల‌ను పటిష్ట‌ప‌రుస్తున్నాం
మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో వైద్య ప‌రిక‌రాల‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఔష‌ధ నిల్వ‌ల కేంద్రాలను పూర్తిస్థాయిలో ప‌టిష్ట‌ప‌రుస్తున్న‌ట్లు తెలిపారు. అన్ని సెంట్ర‌ల్ మెడిక‌ల్ స్టోర్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామ‌న్నారు. అన్ని కేంద్రాల‌కు అద‌నం ఒక డీఈవోను, మ‌రో ఇద్ద‌రు ప్యాక‌ర్ల‌ను నియ‌మిస్తున్నామ‌న్నారు.
సీఎంఎస్‌లో ప‌నిచేసే సిబ్బంది ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేకంగా డ్ర‌స్ కోడ్ అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. మ‌న రాష్ట్రం ప్ర‌భుత్వంలో ఏకంగా 492 ఔష‌ధాల కొనుగోలుకు ధ‌ర ఒప్పందం కుదుర్చుకున్న‌ద‌ని, అదే ప‌క్క రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ 378, త‌మిళ‌నాడు 348, బీహార్ 253 ర‌కాల ఔష‌ధాల‌కు మాత్ర‌మే కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయ‌ని వివ‌రించారు.

ఆస్ప‌త్రుల‌కు పూర్తిస్థాయిలో ప‌రిక‌రాలు
విశాఖ‌ప‌ట్ట‌ణంలోని కేజీహెచ్‌కు సిటీ, ఎమ్మారై యంత్రాల‌ను అతి త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌న్నారు. జీజీహెచ్ కాకినాడ‌, జీజీహెచ్ క‌ర్నూలుకు క్యాత్‌ల్యాబ్‌ను కూడా అతి త్వ‌ర‌లోనే స‌మ‌కూరుస్తామ‌న్నారు. తాజాగా కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని ఆస్ప‌త్రుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిక‌రాలుrajani1 అందుబాటులో ఉంచేందుకు రూ.130 కోట్లు ఖ‌ర్చుచేస్తున్నామ‌న్నారు. యూపీహెచ్‌సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఈ ఏడాది చివ‌రిక‌ల్లా సేవ‌లు అంద‌జేయ‌బోతున్న నేప‌థ్యంలో ఆయా ఆస్ప‌త్రుల‌కు రూ.220 కోట్ల‌తో ప్ర‌త్యేకంగా ప‌రిక‌రాలను అందజేస్తున్నామ‌ని చెప్పారు. ఆయా ప‌రికరాల‌న్నీ స‌మ‌యానిక‌ల్లా ఆస్ప‌త్రుల‌కు చేరేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. క‌ర్నూలులోని జీజీహెచ్‌లో క్యాన్సర్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌ను అభివృద్ధి చేస్తున్న నేప‌థ్యంలో రూ.90 కోట్ల విలువైన క్యాన‌ర్స్ వ్యాధి చికిత్స ప‌రిక‌రాల‌ను అంద‌జేయ‌బోతున్నామ‌ని చెప్పారు.

మందుల కొర‌త లేకుండా చూడండి
వ‌ర్షాకాలం సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో ఆస్ప‌త్రుల్లో సీజ‌న‌ల్ వ్యాధుల మందుల కొర‌త లేకుండా చూడాల్సిన బాధ్య‌త అధికారుల‌దేన‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టినుంచే టెండ‌ర్లు పిలిచి మందులు అందుబాటులో ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. టెండ‌ర్ల విష‌యంలో ఎక్క‌డా విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. అవినీతి, అక్ర‌మాలు లేని స్వ‌చ్ఛ‌మైన పాల‌నే ల‌క్ష్యంగా జ‌గ‌నన్న ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా అధికారులు ప‌నిచేయాల్సి ఉంద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు, జ‌గ‌నన్న ఆశ‌యాల‌కు అనుగునంగా అంద‌రం ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఏపీఎంఎస్ఐడీసీ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, ఏపీఎంఎస్ ఐ డీసీ ఎండీ మ‌ర‌ళీధ‌ర్‌రెడ్డి, ఏపీఎం ఎస్ ఐడీసీ విభాగానికి చెందిన అన్ని శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply